News July 10, 2025
సత్యసాయి భక్తులు గ్రేట్…!

విశాఖలో జరిగిన గిరిప్రదక్షిణకు లక్షలాది మంది భక్తులు వచ్చారు. కిలో మీటర్ల మేర పాదయాత్ర చేసిన భక్తులకు ఉపశమనం కల్పించేందుకు విశాఖ జిల్లా శ్రీసత్య సాయి సేవా సంస్థ సేవలు అందించింది. ప్రదక్షిణ జరిగిన పలు ప్రాంతాల్లో ప్రత్యేక వనమూలికలతో తయారు చేసిన నూనెతో భక్తుల కాళ్లకు మర్దన చేశారు. టీ, మిర్యాల పాలు, ప్రసాదం, అల్పాహారం అందించారు. ఎమ్మెల్యే గణబాబు వీరి సేవలను వీక్షించి అభినందించారు.
Similar News
News July 10, 2025
భధ్రాద్రి: ఉరేసుకుని మహిళ SUICIDE

దమ్మపేట మండలం గండుగులపల్లికి కృపా అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఏడుకొండలు కొమ్ముగూడెంకు చెందిన కృపా(19)ను వివాహం జరిగింది. కొంతకాలంగా ఏడుకొండలు వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని భార్య కృపను వరకట్నం కోసం వేధిస్తున్నాడు. దీంతో మనస్తాపానికి గురైనా ఆమె ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్ఐ సాయికిషోర్ రెడ్డి కేసు నమోదు చేశారు.
News July 10, 2025
8th పే కమిషన్: భారీగా పెరగనున్న జీతాలు!

8th పే కమిషన్ కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇది అమలైతే జీతాలు, పెన్షన్లు 30-34% పెరుగుతాయని Ambit Capital(ఫైనాన్షియల్ అడ్వైజర్) అంచనా వేసింది. 44లక్షల మంది ఉద్యోగులు, 68లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుందని తెలిపింది. బేసిక్ పే, అలవెన్సులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెరుగుతాయంది. కాగా కొత్త పే స్కేల్ 2026 JAN నుంచి అమలవ్వొచ్చని నిపుణులు చెబుతున్నారు.
News July 10, 2025
నంద్యాల జిల్లాలో 3.14 లక్షల మంది: కలెక్టర్

నంద్యాల జిల్లాలోని 1,959 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు 3.14 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని కలెక్టర్ రాజకుమారి తెలిపారు. వెలుగోడులో ఆమె మాట్లాడుతూ.. మన ఎదుగుదలను కోరుకునేది మన గురువులేనన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు. పిల్లలు ఉన్నత స్థాయికి ఎదిగేలా తల్లిదండ్రులు మార్గనిర్దేశం చేయాలన్నారు.