News October 10, 2025

సదరన్ పవర్ ఛైర్మన్‌గా పల్నాడు జిల్లా మొదటి కలెక్టర్

image

పల్నాడు జిల్లా మొట్టమొదటి కలెక్టర్‌గా పనిచేసిన శివ శంకర్ లోతేటిని రాష్ట్ర ప్రభుత్వం సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించింది. ఈ మేరకు గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో తెలంగాణ క్యాడర్‌కు బదిలీ చేసిన అంశంపై ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేసి గెలుపొందారు. తాజాగా జరిగిన ఐఏఎస్‌ల బదిలీల్లో భాగంగా ప్రభుత్వం ఆయన్ను సదరన్ పవర్ ఛైర్మన్‌గా నియమించింది.

Similar News

News October 10, 2025

SKLM: ప్రయాణికులకు శుభవార్త

image

పంచరామ క్షేత్రాలకు శ్రీకాకుళం కాంప్లెక్స్ నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి CH అప్పలనారాయణ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 26, నవంబర్ 2, 9, 16 తేదీల్లో సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ బస్సులు అందుబాటులో ఉంచామన్నారు. భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట వెళ్లేందుకు రూ 2,400, 2,350లతో apsrtconline.inలో టికెట్లు బుక్ చేసుకోవచ్చన్నారు.

News October 10, 2025

బాణసంచా తయారీలో నిభందనలు పాటించాలి: ఎస్పీ

image

దీపావళి పండుగతో పాటు ఇతర వేడుకల సందర్భంగా బాణాసంచా తయారీ, నిల్వ, విక్రయం వంటి కార్యకలాపాలు నిర్వహించే వారు ప్రభుత్వ నిబంధనలు, అగ్నిమాపక భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న విక్రయ కేంద్రాలపై తనిఖీలు జరుగుతాయన్నారు. నిభందనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

News October 10, 2025

HYD: యువతి సూసైడ్.. ఈ యువకుడిపై అనుమానం

image

లాలాపేట PS పరిధి రైల్వే డిగ్రీ కాలేజీ విద్యార్థి మౌనిక(20) సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. MKనగర్‌లో నివాసం ఉండే అంబాజీ(వాలీబాల్ కోచ్) మీద మృతురాలి కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల మీద నమ్మకం ఉందని, నిజాలు తేల్చుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. వాలీబాల్ కోచ్‌ వేధింపులే ఆమె సూసైడ్‌కు కారణమని మౌనిక స్నేహితులు చెప్పారు. కోచ్‌కు కాలేజీకి సంబంధం లేదని అక్కడి సిబ్బంది స్పష్టం చేశారు.