News October 22, 2025
సదర్.. దద్దరిల్లనున్న నారాయణగూడ

సదర్కు హైదరాబాద్ సిద్ధమైంది. నారాయణగూడ YMCA చౌరస్తాలో ప్రత్యేకంగా 4 వేదికలు ఏర్పాటు చేశారు. చెప్పల్బజార్, కాచిగూడ, ముషీరాబాద్, ఖైరతాబాద్తో పాటు నగర నలుమూలల నుంచి యాదవులు వేలాదిగా ఇక్కడికి తరలిరానున్నారు. దేశంలోనే పేరుగాంచిన దున్నరాజులను ప్రదర్శిస్తారు. భారీ లైటింగ్, నృత్యాలు, దున్నరాజులతో యువత విన్యాసాలు సదర్ వైభవాన్ని మరింత పెంచుతాయి. అర్ధరాత్రి వరకు డప్పుల మోతతో నారాయణగూడ దద్దరిల్లనుంది.
Similar News
News October 22, 2025
BIG BREAKING: పోచారంలో కాల్పుల కలకలం

హైదరాబాద్ శివారులోని పోచారంలో కాల్పులు కలకలం రేపాయి. బీజేపీ నేతలు తెలిపిన వివరాలు.. బహదూర్పురాకు చెందిన ఇబ్రహీం నాగారం మున్సిపాలిటీకి పరిధి రాంపల్లికి చెందిన సోనూ సింగ్పై యమ్నంపేట కిట్టి స్టీల్ కంపెనీ వద్ద కాల్పులు జరిపాడు. సోనూ పరిస్థితి విషమించడంతో మేడిపల్లిలోని శ్రీకర హాస్పిటల్కు తరలించారు. కాల్పులకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News October 22, 2025
జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్, సునీత నామినేషన్లకు ఆమోదం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక స్క్రూటినీ వేళ రిటర్నింగ్ ఆఫీస్ వద్ద కోలాహలం నెలకొంది. అభ్యర్థులు పోటీలో ఉంటారా? లేదా? అనే వెరిఫికేషన్ ఆసక్తిని పెంచింది. అభ్యర్థులు అయితే కాస్త టెన్షన్ పడ్డారు. సునీత నామినేషన్ రద్దు చేయాలని, నవీన్ యాదవ్ నామినేషన్ రద్దు చేయాలని SMలో ఇరు పార్టీల నేతలు పోస్టులు పెట్టారు. కానీ, పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన రిటర్నింగ్ అధికారులు నవీన్ యాదవ్, సునీత నామినేషన్లకు ఆమోదం తెలిపారు.
News October 22, 2025
హైదరాబాద్ కలెక్టర్ పిలుపు

తెలంగాణ రైజింగ్-2047 సర్వేలో ప్రజలు, ఉద్యోగులు పాల్గొనాలని కలెక్టర్ హరిచందన పిలుపునిచ్చారు. రాష్ట్ర భవిష్యత్ రూపకల్పన కోసం ఉద్దేశించిన సిటిజన్ సర్వేకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు. 2047 నాటికి దేశ స్వాతంత్ర్యానికి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా తెలంగాణ ఎలా ఉండాలి? అనే దానిపై ప్రజల నుంచి సలహాలు స్వీకరించేందుకు తెలంగాణ రైజింగ్-2047 సిటిజన్ సర్వే నిర్వహిస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు.