News August 27, 2024

సదాశివ‌నగర్‌లో డెంగ్యూతో ఎవరూ మృతి చెందలేదు: వైద్యాధికారి

image

సదాశివనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో డెంగ్యూతో ఎవరూ చనిపోలేదని జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్ తెలిపారు. ఇటీవల రన్విత్ (9), మాన్విశ్రీ (12)లకు తీవ్ర జ్వరం రావడంతో ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. కాగా వారికి మోతాదుకు మించి యాంటీబయోటిక్ మందులు ఇవ్వడంతోనే చనిపోయారని ఆయన స్పష్టం చేశారు. సదాశివనగర్‌కు చెందిన నరేశ్ షుగర్ సమస్యతో మృతి చెందాడని ఆయన పేర్కొన్నారు.

Similar News

News September 16, 2025

నిజామాబాద్: ఈ నెల 17 నుంచి పోషణ మాసం

image

పిల్లల పెరుగుదలకు, పోషణ లోపం తగ్గించుట, బరువు లోపం లేకుండా పోషక ఆహారాలను అందించుటలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం కలెక్టర్ సమావేశం నిర్వహించారు. పోషణ మాసం కార్యక్రమాల అమలు తీరును సమీక్షించి, అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు.

News September 16, 2025

నిజామాబాద్: విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకోవాలి: సీపీ

image

నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సోమవారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జరిగిన ఇంజినీర్స్ డే కార్యక్రమంలో పాల్గొన్నారు. నేటితరం ఇంజినీర్లు భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ముందుగా విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఇంజినీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

News September 16, 2025

నిజామాబాద్: ఓటర్ల జాబితా సవరణకు సిద్ధంగా ఉండాలి

image

నియోజకవర్గాల పరిధిలో ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-2026’ ప్రక్రియను చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి.సుదర్శన్ రెడ్డి సూచించారు. సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ప్రక్రియపై సన్నాహక సమావేశం నిర్వహించారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు అందిన వెంటనే ఓటర్ల జాబితా సవరణను ప్రారంభించాలని, అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.