News February 14, 2026
సదాశివపేట: మున్సిపల్ చైర్మన్గా అంజమ్మ, వైస్ చైర్మన్గా రేణుక

సదాశివపేట మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థుల పేర్లను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి శనివారం అధికారికంగా ప్రకటించారు. చైర్మన్ అభ్యర్థిగా అంజమ్మ, వైస్ చైర్మన్గా రేణుక పోటీ చేస్తారని ఆయన వెల్లడించారు. ఈ నెల 16న జరిగే ఎన్నికల్లో వీరిని ఎన్నుకోవాలని సూచిస్తూ, కౌన్సిలర్లకు పార్టీ తరపున విప్ జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఎంపికతో మున్సిపల్ పీఠంపై కాంగ్రెస్ పట్టు బిగించనుంది.
Similar News
News February 14, 2026
సౌతాఫ్రికాపై న్యూజిలాండ్ స్కోర్ ఎంతంటే?

T20WC: అహ్మదాబాద్లో సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్లో న్యూజిలాండ్ 175-7 స్కోర్ చేసింది. చాప్మన్ 48, మిచెల్ 32, అలెన్ 31 పరుగులతో రాణించారు. సౌతాఫ్రికా బౌలర్ జాన్సెన్ 4 వికెట్లు తీసి సత్తా చాటారు. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు సూపర్-8కి చేరువ కానుంది. ప్రస్తుతం ఇరు జట్లు 2 విజయాలతో పాయింట్స్ టేబుల్లో టాప్-2 స్థానాల్లో కొనసాగుతున్నాయి.
News February 14, 2026
ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లాలి: CM రేవంత్

TG: మున్సిపల్ ఫలితాలపై మంత్రులతో CM రేవంత్ భేటీ ముగిసింది. కాంగ్రెస్ విజయం కోసం శక్తివంచన లేకుండా కృషి చేసిన మంత్రులు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. ఏ ఎన్నికైనా ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లాలని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాలని మంత్రులకు స్పష్టం చేశారు.
News February 14, 2026
పుంగనూరు: 6 వేల ఏళ్లనాటి శివలింగం

పుంగనూరులోని నెక్కొంది కొండపై ఉన్న శ్రీఅగస్తీశ్వర స్వామి ఆలయంలో అగస్త్య మహాముని స్వయంగా లింగాన్ని ప్రతిష్ఠించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ ప్రాచీన ఆలయం చోళుల కాలంలో నిర్మించబడి, శైవ సంప్రదాయానికి పేరు పొందింది. ఇక్కడ శివుడు అగస్తీశ్వరునిగా, పార్వతి దేవి మీనాక్షిగా పూజలందుకుంటారు. ఆలయంలోని శివలింగం 6 వేల సంవత్సరాల పురాతమైనదిగా ప్రజల నమ్మకం.


