News February 14, 2026

సదాశివపేట: మున్సిపల్ చైర్మన్‌గా అంజమ్మ, వైస్ చైర్మన్‌గా రేణుక

image

సదాశివపేట మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థుల పేర్లను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి శనివారం అధికారికంగా ప్రకటించారు. చైర్మన్ అభ్యర్థిగా అంజమ్మ, వైస్ చైర్మన్‌గా రేణుక పోటీ చేస్తారని ఆయన వెల్లడించారు. ఈ నెల 16న జరిగే ఎన్నికల్లో వీరిని ఎన్నుకోవాలని సూచిస్తూ, కౌన్సిలర్లకు పార్టీ తరపున విప్ జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఎంపికతో మున్సిపల్ పీఠంపై కాంగ్రెస్ పట్టు బిగించనుంది.

Similar News

News February 14, 2026

సౌతాఫ్రికాపై న్యూజిలాండ్ స్కోర్ ఎంతంటే?

image

T20WC: అహ్మదాబాద్‌లో సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ 175-7 స్కోర్ చేసింది. చాప్‌మన్ 48, మిచెల్ 32, అలెన్ 31 పరుగులతో రాణించారు. సౌతాఫ్రికా బౌలర్ జాన్సెన్ 4 వికెట్లు తీసి సత్తా చాటారు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సూపర్-8కి చేరువ కానుంది. ప్రస్తుతం ఇరు జట్లు 2 విజయాలతో పాయింట్స్ టేబుల్‌లో టాప్‌-2 స్థానాల్లో కొనసాగుతున్నాయి.

News February 14, 2026

ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లాలి: CM రేవంత్

image

TG: మున్సిపల్ ఫలితాలపై మంత్రులతో CM రేవంత్ భేటీ ముగిసింది. కాంగ్రెస్ విజయం కోసం శక్తివంచన లేకుండా కృషి చేసిన మంత్రులు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. ఏ ఎన్నికైనా ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లాలని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాలని మంత్రులకు స్పష్టం చేశారు.

News February 14, 2026

పుంగనూరు: 6 వేల ఏళ్లనాటి శివలింగం

image

పుంగనూరులోని నెక్కొంది కొండపై ఉన్న శ్రీఅగస్తీశ్వర స్వామి ఆలయంలో అగస్త్య మహాముని స్వయంగా లింగాన్ని ప్రతిష్ఠించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ ప్రాచీన ఆలయం చోళుల కాలంలో నిర్మించబడి, శైవ సంప్రదాయానికి పేరు పొందింది. ఇక్కడ శివుడు అగస్తీశ్వరునిగా, పార్వతి దేవి మీనాక్షిగా పూజలందుకుంటారు. ఆలయంలోని శివలింగం 6 వేల సంవత్సరాల పురాతమైనదిగా ప్రజల నమ్మకం.