News March 29, 2025
సద్గుణాలను పెంపొందించడమే రంజాన్ ముఖ్య ఉద్దేశం: BHPL ఎస్పీ

సద్గుణాలను పెంపొందించడమే రంజాన్ మాస ముఖ్య ఉద్దేశమని భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పట్టణ ముస్లీం పెద్దలు, పోలీసు ముస్లిం ఉద్యోగులకు ఎస్పీ ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. క్రమశిక్షణ, దాతృత్వం కలయికే రంజాన్ మాసం అని అన్నారు. రంజాన్ మాసం అందరిలో సోదర భావం పెంపొందిస్తుందని, ఈ మాసంలో ప్రతి ఒక్కరికి మంచి జరగాలని ఎస్పీ ఆకాంక్షించారు.
Similar News
News March 31, 2025
అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

> ప్రతి గిరిజన గ్రామం అభివృద్ధే ధ్యేయం: ఎమ్మెల్యే శిరీషాదేవి
> రాజవొమ్మంగి: ఏజెన్సీలో ఘనంగా రంజాన్
> అల్లూరి జిల్లాలో కిక్కిరిసిన బస్సులు
> అల్లూరి జిల్లాలో సోషల్ స్టడీస్ పరీక్షకు 11,700 మంది: డీఈవో
> రంపచోడవరం: భారత ఇంజనీర్స్ సమాఖ్య డైరెక్టర్గా వెంకయ్య
> పాడేరు: గూడు కట్టాలంటే..మిల్లర్ లాగాల్సిందే..!
> అనంతగిరి: రోడ్డు వేయాలని దండాలు పెట్టి వేడుకోలు
News March 31, 2025
‘రాజీవ్ యువ వికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తుంది’

రాజీవ్ యువ వికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తుందని, అధికారులు అప్రమత్తంగా ఉండి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశించారు. సోమవారం ప్రజా భవన్ నుంచి ఆయన చీఫ్ సెక్రటరీ, సెక్రటరీలు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించి అధికారులకు సూచనలు చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి పాల్గొన్నారు.
News March 31, 2025
‘నోబెల్’కు పాక్ మాజీ PM ఇమ్రాన్ నామినేషన్

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోమారు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. పాకిస్థాన్ వరల్డ్ అలయెన్స్(PWA) ఈ నామినేషన్ వేసింది. పాక్లో ప్రజాస్వామ్యం, మానవ హక్కుల రక్షణలో ఆయన ఎనలేని సేవ చేశారంటూ ఈ సందర్భంగా కొనియాడింది. గతంలో భారత పైలట్ అభినందన్ను విడుదల చేసినందుకు గాను ఇమ్రాన్ ఖాన్ను నోబెల్కు నామినేట్ చేస్తూ పాక్ పార్లమెంటు తీర్మానం చేసింది. ప్రస్తుతం ఇమ్రాన్ పాక్ జైల్లో ఉన్నారు.