News March 29, 2025

సమాజంలో పేదలకు అండగా ఉండేందుకు పీ-4 లక్ష్యం: కలెక్టర్

image

సమాజంలో పేదలకు అండగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం పీ 4 విధానాన్ని అమలు చేస్తోందని కలెక్టర్ పీ.రంజిత్ బాషా అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో పేదరిక నిర్మూలనకు P4 (ప్రభుత్వ, దాతల, ప్రజల భాగస్వామ్యం) విధానంపై స్టేక్ హోల్డర్లు, తదితరులతో కలెక్టర్ చర్చించారు. సమాజంలో ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న 10 శాతం మంది అత్యంత పేదరికంలో ఉన్న 20 శాతం మందికి చేయూతనివ్వడమే లక్ష్యమన్నారు.

Similar News

News April 1, 2025

కర్నూలు: సెక్షన్ 11 నోటీస్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు- సబ్ కలెక్టర్

image

రీ-సర్వే జరుగుతున్న గ్రామాల్లో 9(2) నోటీసులోని విస్తీర్ణంపై అభ్యంతరాలు ఉంటే సెక్షన్ 11 నోటీస్ ద్వారా మొబైల్ మెజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేయవచ్చునని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పేర్కొన్నారు. మంగళవారం ఆదోని మండలంలోని పైలట్ గ్రామంగా ఎన్నికైన పెసలబండ గ్రామంలో జరుగుతున్న రీ-సర్వే ప్రక్రియను ఆయన పరిశీలించి, రైతులకు 9(2) నోటీసులు అందజేశారు. గ్రామంలో మొత్తం 1591.58 ఎకరాలు, 474 ఖాతాలు ఉన్నాయన్నారు.

News April 1, 2025

కర్నూలు: పరీక్షా కేంద్రంలో కలెక్టర్ తనిఖీ

image

పదో తరగతి పరీక్షల్లో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా కర్నూలు నగరంలోని దామోదరం సంజీవయ్య, స్మారక మున్సిపల్ హై స్కూల్ పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ.. విద్యార్థులకు మెరుగైన సదుపాయాలను కల్పించడంలో అధికారులు సఫలమయ్యారని అన్నారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు చూసుకోవాలని ఆదేశించారు.

News April 1, 2025

కర్నూలు జిల్లాలో 54.35% పింఛన్ల పంపిణీ@9Am.!

image

కర్నూలు జిల్లాలో ఏప్రిల్ నెలకు సంబంధించి మంగళవారం ఎన్టీఆర్ భరోసా పథకం కింద సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ప్రభుత్వం ఆదేశాలతో ఉదయం 7 గంటల నుంచే ఈ కార్యక్రమం ప్రారంభం కాగా.. ఉదయం 9 గంటలకు జిల్లాలో 54.35% పింఛన్ల పంపిణీ పూర్తయింది. ఇప్పటివరకు జిల్లాలో 2,38,302 మందికి గానూ 1,29,522 మందికి సచివాలయ ఉద్యోగులు పింఛన్ సొమ్మును అందజేశారు.

error: Content is protected !!