News February 15, 2026
సమ్మర్ ఎంటర్.. ఏసీలు సర్వీసింగ్ చేయిస్తున్నారా?

తెలుగు రాష్ట్రాల్లో శీతాకాలం దాదాపు ముగిసిపోయి సమ్మర్ ఎంటరైంది. దీంతో ఏసీల వాడకానికి టైమ్ వచ్చేసింది. అయితే ముందుగా వాటిని సర్వీసింగ్ చేయించాలని నిపుణులు చెబుతున్నారు. లేకపోతే కూలింగ్ సరిగా ఇవ్వకపోగా పవర్ బిల్ షాక్ ఇస్తుందని హెచ్చరిస్తున్నారు. ఎయిర్ ఫిల్టర్లను శుభ్రం చేయడం, గ్యాస్ లీక్లను టెక్నీషియన్లతో చెక్ చేయించాలని సూచిస్తున్నారు. ఏటా రెండు సార్లైనా సర్వీసింగ్ చేయించాలంటున్నారు.
Similar News
News February 17, 2026
IOCL దిగ్బోయ్ రిఫైనరీలో పోస్టులు

<
News February 17, 2026
కుటుంబ కలహాలు తొలగేందుకు పరిహారాలు

కుటుంబంలో ప్రశాంతత కోసం వాస్తు నిపుణులు కొన్ని పరిహారాలు సూచిస్తున్నారు. వాటి ప్రకారం.. ప్రతికూల శక్తిని పోయేందుకు ఇంటి ఈశాన్యంలో తులసి మొక్కకు నిత్యం నీరు పోయాలి. అదే దిశలో రాగి/ఇత్తడి బిందెతో నీటిని ఉంచాలి. దృష్టి దోషాలు పోవాలంటే దక్షిణాన పంచముఖ ఆంజనేయ ఫోటోను ఉంచాలి. అలాగే లక్ష్మీ గణపతి విగ్రహాలను ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. సానుకూల శక్తితో ఇల్లు ఆనంద నిలయంగా మారుతుంది.
News February 17, 2026
మొక్కల పెరుగుదలలో పోషకాల పాత్ర కీలకం

☛ యూరియా: మొక్కల్లో ఆకుల పెరుగుదల, కాండం వృద్ధి, పచ్చదనానికి కారణమవుతుంది. ☛ భాస్వరం: మొక్కల వేర్ల అభివృద్ధికి అవసరం ☛ పొటాష్: మొక్కల ఆరోగ్యం, గింజలు, కాయల నాణ్యతలో కీలక పాత్ర పోషిస్తుంది.
☛ ఇక జింక్, ఇనుము, బోరాన్, కాపర్ వంటి సూక్ష్మపోషకాలు తక్కువ పరిమాణంలో అవసరమైనా పంటలకు చాలా కీలకం. ఇవి పూత రాలిపోకుండా, కాయలు సక్రమంగా ఏర్పడేలా చేస్తాయి. మొక్కల అంతర జీవక్రియలు సక్రమంగా జరగడానికి సహాయపడతాయి.


