News November 11, 2025

సాగర్‌లో క్రీడా పోటీలను ప్రారంభించిన కలెక్టర్

image

మహాత్మా జ్యోతిరావు పూలే వెనుకబడిన తరగతుల విద్యాలయంలో ఉమ్మడి జిల్లా స్థాయి క్రీడా పోటీలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఘనంగా ప్రారంభించారు. మంగళవారం నాగార్జునసాగర్ మహాత్మ జ్యోతిరావు పూలే వెనుకబడిన తరగతుల గురుకుల విద్యాలయంలో ఉమ్మడి జిల్లా స్థాయి అండర్ 14, 19 పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ సంస్థ పీడీ రాజకుమార్, ఆర్సీఓ స్వప్న పాల్గొన్నారు.

Similar News

News November 11, 2025

నల్గొండ జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

→ NLG: 13 నుంచి ఎంజీయూ డిగ్రీ పరీక్షలు
→ NLG: వే2న్యూస్ కథనానికి అధికారుల స్పందన
→ కేతేపల్లి: నార్కోటిక్స్ కట్టడిలో నల్గొండ పోలీస్ సంచలనం
→ NLG: వానాకాలం ధాన్యం సేకరణపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్
→ NLG: 4 నెలలుగా పారిశుద్ధ్య కార్మికులకు అందని వేతనాలు
→ NLG: 50 శాతం సిలబస్ ఇంకా అలానే..
→ NLG: పంట పండింది.. సేకరణ ఇలా
→ MLG: రబ్బరులా ఇడ్లీ రవ్వ
→చిట్యాల : బస్సు దగ్ధం.. ప్రయాణికుల రియాక్షన్

News November 11, 2025

NLG: వానాకాలం ధాన్యం సేకరణపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్

image

వానాకాలం ధాన్యం సేకరణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె ధాన్యం సేకరణపై సంబంధిత శాఖల అధికారులు, తహశీల్దార్లు, మండల వ్యవసాయ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా యంత్రాంగం ధాన్యం సేకరణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, నవంబర్, డిసెంబర్ మొదటి వారం వరకు జిల్లాలో కొనుగోలు కేంద్రాలకు పెద్ద ఎత్తున ధాన్యం వచ్చే అవకాశం ఉందన్నారు.

News November 11, 2025

నల్గొండ: 4 నెలలుగా పారిశుద్ధ్య కార్మికులకు అందని వేతనాలు

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో పంచాయతీల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు నాలుగు నెలలుగా జీతాలు అందడం లేదు. దీంతో అప్పులు చేయాల్సి వస్తుందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని 1,781 గ్రామ పంచాయతీలను నిధుల కొరత వేధిస్తోంది. అభివృద్ధి సంగతి అటు ఉంచితే.. కనీసం జీతాలు, జీపీల మెయింటెనెన్స్ లాంటి పనులకు కూడా తీవ్ర ఆటంకం కలుగుతుందని గ్రామస్థులు తెలిపారు.