News July 19, 2024
సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేసిన అధికారులు

తాగునీటి అవసరాల కోసం ఎన్ఎస్పీ అధికారులు నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేశారు. ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ పూర్తిగా ఎండిపోవడంతో అక్కడ ఏర్పడిన తాగునీటి సమస్యను దృష్టిలో ఉంచుకొని నీటిపారుదల శాఖ అధికారులు నీటిని విడుదల చేశారు. రోజుకు 1000 క్యూసెక్కుల నీటిని ఎడమ కాలువకు విడుదల చేస్తామని చెప్పారు. ఈ నీటిని తాగునీటి అవసరాలకు మాత్రమే పొదుపుగా ఉపయోగించాలని అధికారులు కోరారు.
Similar News
News December 31, 2025
NLG: కార్పొరేషన్ కలే.. ఈసారీ అంతే..!

NLG మునిసిపాలిటీ కార్పొరేషన్ అయ్యే కల సాకరమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. 2018 ఎన్నికలకు ముందు BRS ప్రభుత్వం NLGను మహానగరంగా చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అప్పట్లో 7 గ్రామాలను విలీనం చేయగా ఆ గ్రామాల ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని మున్సిపల్ ఎన్నికలు నిర్వహించారు. 3 నెలల క్రితం మళ్లీ ప్రతిపాదనలు చేసినా ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది.
News December 31, 2025
నల్గొండ: ‘ఆపరేషన్ చబుత్ర’తో పోలీసుల తనిఖీలు

నల్గొండ జిల్లాలో నేరాలు, రోడ్డు ప్రమాదాల అదుపునకు ఎస్పీ శరత్ చంద్ర పవార్ పర్యవేక్షణలో చేపట్టిన ‘ఆపరేషన్ చబుత్ర’ సత్ఫలితాలనిస్తోంది. 30 బృందాలతో చేపట్టిన విస్తృత తనిఖీల్లో డ్రంకెన్ డ్రైవ్ కింద 337 కేసులు నమోదు చేశారు. పట్టుబడిన 300 మంది యువకులకు తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చారు. డిసెంబర్ 31 వరకు ఈ తనిఖీలు కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.
News December 31, 2025
నల్గొండ: ‘ఇలా’ వచ్చి.. ‘అలా తనదైన ముద్ర వేశారు’

14 నెలల పదవీకాలంలో కలెక్టర్గా ఇలా త్రిపాఠి జిల్లాలో తనదైన ముద్రవేశారు. 2024 అక్టోబరు 28న ఇలా త్రిపాఠి కలెక్టర్గా నియమితులయ్యారు. నిత్యం జిల్లాలో ఏదో ఒక ప్రాంతాన్ని సందర్శించి అక్కడి ప్రజలతో మమేకమవడమే గాక పలు పథకాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రధానంగా విద్యాభివృద్ధి, మారుమూల గిరిజన ప్రాంతాల్లో వైద్యసేవల కోసం ఆమె ప్రత్యేకంగా కృషి చేశారు.


