News April 23, 2025
సాగర్ కలుషితం తీరుతుందెప్పుడో!

HYDలోని హుస్సేన్ సాగర్ రోజురోజుకు కలుషితం అవుతోంది. ఇటీవలే PCB నిర్వహించిన వాటర్ క్వాలిటీ టెస్ట్ రిపోర్టులో ఇది వెల్లడైంది. ఖైరతాబాద్ STP, సంజీవయ్య పార్కు వద్ద BOD స్థాయి పరిమితికి మించి 86,92గా భారీగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. నీటి జీవరాశులు బతికేందుకు నీటిలో కరిగే ఆక్సిజన్ అవసరం. దీని స్థాయి రోజురోజుకూ అనేక ప్రాంతాల్లో తగ్గుతున్నట్లు PCB లెక్కల్లో తేలింది.
Similar News
News April 23, 2025
HYD: MLC ఎన్నిక.. 112లో 88 మంది ఓటు

22 ఏళ్ల తర్వాత జరిగిన హైదరాబాద్ MLC కోటా ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 4 గంటల వరకు 112 ఓటర్లు ఉండగా మొత్తం 88 మంది ఓటు వేశారు. 24 మంది BRS ఓటర్లు మినహాయిస్తే MIM, కాంగ్రెస్, BJP సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 10 గంటల వరకు 37.51%, మ. 12 గంటల వరకు 77.68%, మధ్యాహ్నం 78.57% ఓటింగ్ నమోదు అయ్యింది.
News April 23, 2025
బాన్సువాడ: చదువు విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయిస్తుంది: DEO

చదువు మాత్రమే విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయిస్తుందని DEO అశోక్ అన్నారు. బుధవారం బాన్సువాడ మండలం బోర్లం ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. వేసవి సెలవులు ఉన్నందున పిల్లలకు ఇంటి వద్ద చదివించాలన్నారు. అనంతరం 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు ప్రగతి పట్టాలను అందజేశారు. ప్రధానోపాధ్యాయులు వెంకటరమణ, గోపి, అయ్యాల సంతోష్ ఉన్నారు.
News April 23, 2025
వీరయ్య చౌదరికి CM నివాళి

నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలులోని వీరయ్య చౌదరి నివాసానికి CM చంద్రబాబు చేరుకున్నారు. వీరయ్య మృతదేహానికి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. అన్ని విధాలుగా తాను అండగా ఉంటానని భరోసా కల్పించారు.