News March 11, 2025
సాగునీటికి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలి: కలెక్టర్

ఎండుతున్న పంటలకు సాగునీరు అందించేందుకు వీలుగా ప్రత్యామ్నాయ మార్గాలు ఉంటే అన్వేషించాలని వ్యవసాయ శాఖ అధికారులను, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. మంగళవారం ధర్పల్లి, సిరికొండ మండలాల్లో క్షేత్రస్థాయిలో ఎండిపోయిన పంటలను రైతులతో కలిసి ఆయన పరిశీలించారు. వచ్చే యాసంగిలో నీటి లభ్యత ఆధారంగా పంటలు వేసుకునే విధంగా రైతులను చైతన్యపరచాలన్నారు.
Similar News
News March 12, 2025
NZB: అసెంబ్లీ రోజున ప్రజాప్రతినిధుల అరెస్టులా?: కవిత

అసెంబ్లీ రోజున ప్రజాప్రతినిధుల అరెస్టులా? అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత X వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలంటూ ప్రజాస్వామ్య పద్దతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తమ గోడు చెప్పుకునేందుకు హైదరాబాద్ వస్తున్న తాజా మాజీ సర్పంచ్లను రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నమన్నారు. సర్పంచ్లను కలిసేందుకు సీఎం ఎందుకు భయపడుతున్నారన్నారు.
News March 12, 2025
నేడు బడ్జెట్… NZB జిల్లాకు ఏం కావాలంటే?

అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా సాగునీటి సమస్యను పరిష్కరించాలని, ప్రస్తుతం పసుపు రైతులు ఎదుర్కొంటున్న మద్దతు ధర సమస్య విషయంలో చొరవ చూపాలని కోరుతున్నారు. అలాగే నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు చర్యలు చెప్పట్టాలని, జిల్లాలో ప్రభుత్వ ఇంజినీర్ కళాశాల నిర్మణానికి నిధులు కేటాయించాలి కోరుతున్నారు.
News March 12, 2025
కామారెడ్డి: పదోతరగతి విద్యార్థి సూసైడ్

కామారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కడుపునొప్పి భరించలేక గర్గుల్కు చెందిన పదోవతరగతి విద్యార్థి శరత్ కుమార్ (16) ఉరేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా శరత్కు క్రికెట్ అంటే ప్రాణమని పైగా విరాట్ కోహ్లికి వీరాభిమాని అని స్థానికులు తెలిపారు. జిల్లా స్థాయి క్రికెట్ టోర్నీల్లో అనేక అవార్డులను శరత్ సొంతం చేసుకున్నాడు. శరత్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.