News October 4, 2025
సాగునీటి వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించాలి: కలెక్టర్

జిల్లాలో సాగునీటి వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ హిమాన్షు శుక్ల అధికారులను ఆదేశించారు. రిజర్వాయర్లు, చెరువుల్లో సాగునీటి నిల్వలు, ఇరిగేషన్ పనుల మరమ్మతులపై శుక్రవారం అధికారులతో ఆయన సమీక్షించారు. సోమశిల, కండలేరు జలాశయాల్లో నీటి నిల్వలు సమృద్ధిగా ఉన్నందున అన్ని మేజర్, మైనర్ చెరువులను 50 శాతానికి పైగా నీటితో నింపాలన్నారు.
Similar News
News October 4, 2025
సత్తా చాటిన ముత్తుకూరు యువకులు

నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలానికి చెందిన క్రీడాకారులు టెన్నిస్ బాల్ T10 అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్కు భారత్ తరఫున ప్రకాశ్, నాగేంద్ర ఎంపికయ్యారు. డిసెంబర్ 25 నుంచి 31 వరకు థాయిలాండ్ జరగబోయే సెకండ్ ఏసియన్ టెన్నిస్ బాల్ T10 క్రికెట్ ఛాంపియన్షిప్లో పాల్గొంటారు. వీరు ఇంతకుముందు ఒరిస్సాలో సెప్టెంబర్ 9న జరిగిన జాతీయస్థాయి పోటీల్లో కూడా ప్రతిభ కనపరిచారు.
News October 3, 2025
గూడూరు బస్టాండ్లో దిన దిన గండం

కీలకమైన గూడూరు బస్టాండ్ ప్రయాణికుల పాలిట దిన దిన గండంగా మారింది. ప్రయాణికులు వేచి చోట ఉండే స్లాబులు పెచ్చులూడుతున్నాయి. కమ్ములు బయటపడి ఎప్పుడు ఏ పెచ్చు ఊడి పైన పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. RTC ఉన్నతాధికారులకు ఈ విషయం తెలిసిన పట్టించుకోవడం లేదు. అనుకోని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు అనేది ప్రశ్నర్ధకంగా మారింది.
News October 3, 2025
నెల్లూరు: యాక్సిడెంట్ కాదు.. హత్య?

నెల్లూరు జిల్లా గుడ్లూరు(M) రాళ్లపాడు సమీపంలో కారు ఢీకొని ఒకరు <<17897415>>చనిపోయిన <<>>విషయం తెలిసిందే. ఇది పక్కా హత్య అని సమాచారం. దారకానిపాడుకు చెందిన తిరుమలశెట్టి(26) మరో ఇద్దరితో కలిసి బైకుపై కందుకూరు నుంచి ఇంటికి బయల్దేరాడు. అదే ఊరికి చెందిన ఓ వ్యక్తి కారుతో వచ్చి బైకును ఉద్దేశపూర్వకంగానే ఢీకొట్టాడని సమాచారం. నిందితుతు, మృతుడి మధ్య ఆర్థిక, వివాహేతర విషయమై మధ్య విభేదాలు ఉన్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు.