News April 4, 2025
సామర్లకోట: మున్సిపల్ ఛైర్ పర్సన్తో సహా మరో నేతపై వైసీపీ సస్పెన్షన్ వేటు

సామర్లకోట మున్సిపల్ ఛైర్పర్సన్ గంగిరెడ్డి అరుణ కృష్ణమూర్తితో సహా జడ్పీటీసీ భర్త సూర్యనారాయణ మూర్తి (నరేశ్)పై వైసీపీ సస్పెన్షన్ వేటు వేసినట్లు పార్టీ నేతలు స్పష్టం చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ ఆదేశాల మేరకు పెద్దాపురం ఇన్ఛార్జ్ దొరబాబు ఆధ్వర్యంలో ఆ ఇద్దరు నేతలపై సస్పెన్షన్ వేటు వేసినట్లు వెల్లడించారు.
Similar News
News September 14, 2025
రానున్న 2-3 గంటల్లో వర్షం

తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 2-3 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, యాదాద్రి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. భద్రాద్రి, HNK, HYD, BPL, JGL, JNM, KMM, ASF, మేడ్చల్, MHBD, MNCL, MUL, NLG, NRML, PDPL, రంగారెడ్డి, సంగారెడ్డి NZM, WGL జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. అటు APలోని తిరుపతి, ప.గో తదితర జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
News September 14, 2025
రేవంత్ సర్కార్ను జూబ్లీహిల్స్ ఓటర్లు ఆశీర్వదించాలి: మంత్రి

పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా HYDలో మౌలిక సదుపాయాలు కల్పన దిశగా సీఎం రేవంత్ రెడ్డి విజనరీగా పని చేస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆదివారం జూబ్లీహిల్స్ పరిధిలో ఆత్మీయ సమావేశాల్లో మంత్రి పాల్గొన్నారు. హైదరాబాద్ విశ్వనగరం అజెండాగా అభివృద్ధి చేయాలనే పట్టుదలతో సీఎం పనిచేస్తున్నారన్నారు. ఆయనను, ప్రజా ప్రభుత్వాన్ని జూబ్లీహిల్స్ ఓటర్లు ఆశీర్వదించాలని కోరారు.
News September 14, 2025
GREAT: 97 సైబర్ కేసులు.. రూ.32,19,769 రిఫండ్

MBNRలోని నమోదైన సైబర్ క్రైమ్ కేసులను 97 ఛేదించినట్లు సైబర్ క్రైమ్ SI శ్రవణ్ కుమార్ Way2Newsతో తెలిపారు. 97 మంది బాధితులకు సంబంధించి రూ.32,19,769 ఫ్రీజ్ చేయించి రిఫండ్ చేయించామని, సైబర్ సెక్యూరిటీ బ్యూరో బాధితులకు రిఫండ్ ఆర్డర్ కాపీలు అందజేశామన్నారు. బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. దీంతో SP జానకి, అడిషనల్ ఎస్పీ రత్నం అభినందించారు. సైబర్ నెరగాళ్లతో మోసపోయినట్లు తెలిస్తే గంటలోపు 1930 కాల్ చేయాలన్నారు.