News March 20, 2025
సామర్లకోట : రైలు దిగుతూ జారి పడి వ్యక్తి మృతి

కాకినాడ జిల్లా సామర్లకోట సమీపంలో రైలు నుంచి దిగుతూ ఒక యువకుడు మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. బుధవారం రాత్రి పెద్దాపురానికి చెందిన సిమ్ము సిరి త్రినాథ్ తల్లి విజయలక్ష్మి విశాఖపట్నం ఆసుపత్రికి తీసుకువెళ్లి తిరిగి వచ్చే క్రమంలో ప్రమాదానికి గురయ్యాడు. నిద్రమత్తులో ఉన్న త్రినాథ్ రైలు నుంచి దిగేందుకు ప్రయత్నించి, ప్రమాదానికి గురయ్యాడు. రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News November 9, 2025
వారంలో టెట్ నోటిఫికేషన్?

TG: టెట్ నిర్వహణ కోసం విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన ఫైల్ సీఎంకు చేరింది. ఏటా రెండు సార్లు టెట్ నిర్వహించాల్సి ఉండగా ఈ ఏడాది రెండో విడత నోటిఫికేషన్ కోసం అధికారులు ఫైల్ సిద్ధం చేశారు. ప్రభుత్వ అనుమతి వస్తే వారంలో నోటిఫికేషన్ వచ్చే అవకాశముంది. కాగా టీచర్లూ టెట్ పాసవడం తప్పనిసరి అయిన నేపథ్యంలో వారికి అవకాశం కల్పించేందుకు అర్హత నిబంధనల జీవోను సవరించాల్సి ఉంది.
News November 9, 2025
కోవూరులో స్లాబ్ కూలి కార్పెంటర్ మృతి

స్లాబ్ కూలి కార్పెంటర్ మృతి చెందిన ఘటన కోవూరులో చోటుచేసుకుంది. కోవూరు గ్రామంలోని లక్ష్మీనగర్లో నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి స్లాబ్ పనులను కార్పెంటర్ పట్నం ప్రసాద్ (48) చేస్తుండగా ప్రమాదవశాత్తు స్లాబ్ కూలి మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పంచనామా నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News November 9, 2025
మల్బరీలతో క్యాన్సర్కు చెక్ పెట్టొచ్చు!

మల్బరీ పండ్లు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు వైద్యులు. 3 రంగుల్లో లభించే ఈ పండ్లలో విటమిన్ బి1, బి2, బి3, బి6, సి, ఇ, ఐరన్, కాల్షియమ్, పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్పరస్, ఫోలేట్, సోడియం, జింక్ వంటి పోషకాలు ఉంటాయని చెబుతున్నారు. మల్బరీల్లోని ఆంథోసైనిన్లు పెద్దప్రేగు, చర్మ, ప్రోస్టేట్ క్యాన్సర్ కణాలను నిరోధిస్తాయని, డైటరీ ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని అంటున్నారు.


