News February 10, 2025

సామాజికవేత్త గడ్డం రాజగోపాల్ మృతి

image

శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలానికి చెందిన సామాజికవేత్త గడ్డం రాజగోపాల్ మృతి చెందినట్లు వారి బంధువులు తెలిపారు. హైదరాబాదులో స్థిరపడ్డ ఆయన కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో కూటమి నాయకులు హైదరాబాద్ బసవతారకం ఆసుపత్రిలో చికిత్సకు దోహదపడ్డారు. ఆయన మరణ వార్త విని ధర్మవరం నియోజకవర్గ ప్రజలు దిగ్భ్రాంతికి లోనయ్యారు. 10 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

Similar News

News December 23, 2025

ENG కోచ్‌గా తప్పుకుంటారా? మెక్‌కల్లమ్‌ ఏమన్నారంటే?

image

యాషెస్ సిరీస్‌ను <<18628859>>ENG కోల్పోవడంతో<<>> కోచ్ మెక్‌కల్లమ్‌, బజ్‌బాల్ ఆటపై విమర్శలొస్తున్నాయి. దీంతో మెక్‌కల్లమ్‌ కోచ్‌గా కొనసాగుతారా అనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై ఆయన స్పందిస్తూ ‘అది నా చేతుల్లో లేదు. కోచింగ్‌ను ఆస్వాదిస్తున్నా. ప్లేయర్ల నుంచి బెస్ట్ రాబట్టడమే నా పని. నేను కోచ్‌గా వచ్చాక టీమ్ ఇంప్రూవ్ అయింది. నేను కోచ్‌గా ఉన్నంత వరకు మా ఆట తీరు మారదు. మిగిలిన 2 టెస్టుల్లో బెస్ట్ ఇస్తాం’ అని చెప్పారు.

News December 23, 2025

పర్యాటక అద్భుతాలు పరిచయం చేస్తే బహుమతులు: ASF కలెక్టర్

image

కొమురం భీమ్ జిల్లాలో దాగి ఉన్న పర్యాటక అందాలను ఫొటోలు, వీడియోల రూపంలో పరిచయం చేసిన వారికి పర్యాటకశాఖ ఆధ్వర్యంలో భారీ నగదు బహుమతి అందజేస్తామని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో పర్యాటక శాఖ అధికారి అష్ఫాక్ అహ్మద్‌తో కలిసి ‘100 వీకెండ్ వండర్స్’ గోడ ప్రతులను ఆవిష్కరించారు.

News December 23, 2025

నేడు నల్గొండకు KTR

image

ఉద్యమాల గడ్డ నల్గొండ జిల్లా కేంద్రానికి మంగళవారం మాజీ మంత్రి, BRS పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ KTR రానున్నారు. నల్గొండ జిల్లాలో BRS పార్టీ బలపరిచి గెలుపొందిన గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డ్ మెంబర్లను కలిసి KTR అభినందిస్తారని పార్టీ శ్రేణులు తెలిపాయి. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం వద్దకు సమయానికి హాజరుకావాలని కార్యకర్తలకు నేతలు పిలుపునిచ్చారు.