News June 6, 2024

సామాన్య కార్యకర్తను ఎంపీగా చేశారు: కలిశెట్టి

image

టీడీపీ అధినేత చంద్రబాబును కలిసేందుకు వెళ్లిన విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు చంద్రబాబు నివాసం వద్ద ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేశ్ బ్యానర్లకు పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సామాన్య కార్యకర్తను ఎంపీగా చేసిన ఘనత లోకేశ్‌కే దక్కుతుందని అన్నారు. ఈ స్థాయికి‌‌ తీసుకువచ్చిన చంద్రబాబు, లోకేశ్‌ను కలిసి అభినందనలు తెలిపేందుకు వచ్చానని‌ ఆయన తెలిపారు.

Similar News

News April 24, 2025

బాలికను రక్షించిన కానిస్టేబుల్‌కు ప్రశంసా పత్రం

image

విజయనగరం వైఎస్ఆర్ నగర్ ప్రాంతంలోని ఒక అపార్టుమెంట్లో అమ్మాయి ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నట్లుగా డయల్ 112కు ఫిర్యాదు వచ్చింది. టూ టౌన్ కానిస్టేబుల్ ఆర్.జగదీష్ సకాలంలో స్పందించి 17 ఏళ్ల అమ్మాయిని రక్షించారు. దీంతో ఎస్పీ వకుల్ జిందాల్ కానిస్టేబుల్‌ని బుధవారం అభినందించి, ప్రశంసా పత్రం అందజేశారు.

News April 23, 2025

10th RESULTS: ఏడో స్థానంలో విజయనగరం జిల్లా

image

పదో తరగతి పరీక్షా ఫలితాల్లో విజయనగరం జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం 22,777 మంది పరీక్ష రాయగా 19,824 మంది పాసయ్యారు. 11,413 మంది బాలురులో 9.748(85.41%) మంది, 11,364 మంది బాలికలు పరీక్ష రాయగా 10,076(88.67%) మంది పాసయ్యారు. 87.04% పాస్ పర్సంటైల్‌తో రాష్ట్రంలో విజయనగరం జిల్లా ఏడో స్థానంలో నిలిచింది.

News April 23, 2025

VZM: ఆ పాఠశాల ఫలితాల కోసం ఎదురుచూపు

image

బొబ్బిలి మండలం పెంట జిల్లా పరిషత్ పాఠశాల ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. విద్యార్థులు బాగా చదవడం లేదని పరీక్షలకు నెల రోజుల ముందు హెచ్ఎం రమణ విద్యార్థుల ముందు గుంజీలు తీసిన సంగతి తెలిసిందే. దీంతో విద్యార్థులు బాగా చదివి మంచి ఫలితాలు సాధిస్తామని, ట్రిపుల్ ఐటి సీట్లు సాధిస్తామని హామీ ఇచ్చారు. మొత్తం 85 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరి ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

error: Content is protected !!