News April 6, 2025

సారపాక గెస్ట్ హౌస్‌కు చేరుకున్న డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యేలు

image

భద్రాద్రి రామయ్య కళ్యాణానికి విచ్చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి స్వాగతం పలికేందుకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సారపాకలోని గెస్ట్ హౌస్‌కు చేరుకున్నారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకటరావు, మాలోత్ రాందాస్ నాయక్, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయి దయానంద్, అటవీ శాఖ రాష్ట్ర కార్పొరేషన్ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్య ఉన్నారు.

Similar News

News April 11, 2025

రేపే రిజల్ట్.. ఏలూరు జిల్లాలో విద్యార్థులు ఎదురు చూపు

image

ఇంటర్ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. ఏలూరు జిల్లాలో 32,411 మంది ఇంటర్‌ విద్యార్థులు రాయగా వీరిలో ప్రథమ సంవత్సరం 18,195, ద్వితీయ సంవత్సరం 14,216 విద్యార్థులు పరీక్షల రాశారు. మార్చి ఒకటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

News April 11, 2025

WGL: చిరుదాన్యాల ధరల వివరాలు….

image

వరంగల్ ఎనుమాముల మార్కెట్‌లో నేడు (శుక్రవారం) చిరుధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. సూక పల్లికాయ క్వింటా ధర రూ.6,200, పచ్చి పల్లికాయ రూ.4,250 పలికింది. అలాగే పసుపు (కాడి) క్వింటా ధర రూ.13,659, పసుపు (గోల)కి రూ.12,689 వచ్చింది. మరోవైపు మక్కలు (బిల్టీ) క్వింటా ధర రూ.2,320 పలికినట్లు అధికారులు వెల్లడించారు. కాగా మక్కల ధర 2 రోజులతో పోలిస్తే పెరిగింది.

News April 11, 2025

ఫూలే సిద్దాంతాలు ఆదర్శప్రాయం: కలెక్టర్ 

image

సమ సమాజ స్థాపనకు అహర్నిశలు కృషి చేసిన సంఘ సంస్కర్త సామాజిక తత్వవేత్త మహాత్మా జ్వోతిరావ్ ఫూలే అని నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్‌ లక్ష్మీశ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని ఫూలే జయంతి వేడుకలను పురస్కరించుకొని కలెక్టర్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సామాజిక అసమానతలను రూపుమాపేందుకు సామాజిక ఉద్యమానికి అలుపెరగని పోరాటం చేశారన్నారు. 

error: Content is protected !!