News June 14, 2024
సార్వత్రిక ఫలితాల్లో సంగారెడ్డి ఫస్ట్.. సిద్దిపేట లాస్ట్
ఓపెన్(సార్వత్రిక) పది, ఇంటర్ ఫలితాల్లో ఉమ్మడి జిల్లాలోనే సంగారెడ్డి జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు. పదో తరగతితో 79.6% ఉత్తీర్ణతతో సంగారెడ్డి జిల్లా ఫస్ట్ స్థానంలో నిల్వగా.. 77.95 %తో మెదక్ ద్వితీయ, 42.65% సిద్దిపేట జిల్లా మూడో స్థానంలో నిలిచింది. ఇంటర్లో సంగారెడ్డిలో 67.03 %, మెదక్ 60.16%, సిద్దిపేటలో 37.18% ఉత్తీర్ణత నమోదైనట్లు సంగారెడ్డి డీఈవో వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.
Similar News
News October 2, 2024
MDK: మహిళలు మౌనం వీడి రక్షణ పొందండి: జిల్లా ఎస్పీ
మహిళలు, విద్యార్థినులు, బాలికలు మౌనం వీడి వేధింపులపై షీ టీంకు సమాచారం ఇచ్చి రక్షణ పొందాలని మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రతి నెల జిల్లాలోని ప్రతి పాఠశాలలు, కళాశాలలలు, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. షీ టీం వాట్సాప్ నెంబర్ 87126 57963, 63039 23823, పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 87126 57888లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.
News October 2, 2024
మెదక్: ప్రజలకు హరీష్ రావు బతుకమ్మ శుభాకాంక్షలు
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. బతుకమ్మ పండుగ ప్రారంభోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అమావాస్య నుంచి తొమ్మిది రోజులు ఆడపడుచులు కలిసి ఆడే గొప్ప పండుగ బతుకమ్మ అన్నారు. దేశంలోనే పూల ను పూజించి ప్రకృతిని ప్రేమించే పండుగ అన్నారు. అలాంటి సంస్కృతి తెలంగాణలో ఉందన్నారు.
News October 2, 2024
సంగారెడ్డిలో దారుణం.. అన్నను చంపిన తమ్ముడు
సంగారెడ్డి పట్టణంలోని నాల్ సాబ్ గుడ్డలో మంగళవారం రాత్రి దారుణం చోటు చేసుకుంది. పట్టణ ఎస్ఐ భాస్కర్ రెడ్డి కథనం ప్రకారం.. మద్యం మత్తులో అన్నషాహిద్(46)ను తమ్ముడు రఫిక్ (40) కల్లు సీసాతో కొట్టి హత్య చేశాడు. తనను, తన భార్యను అన్న సూటిపోటి మాటలతో బాధించేవాడని హంతకుడు రఫిక్ తెలిపారు. పోలీసులు రఫిక్ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.