News March 19, 2025
సాలూరు: గిరిజనులపై దాడి చేసిన వారిపై అట్రాసిటీ కేసు నమోదు

గిరిజనులపై దాడి చేసిన వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు సాలూరు రూరల్ ఎస్సై నరసింహమూర్తి తెలిపారు. ఈ నెల 15న తోణాం పంచాయతీ మద్దిన వలస గ్రామంలో పొలం గట్టు గొడవలో కోనేటి లక్ష్మణరావు ఆయన భార్య ఝాన్సీలపై దాడి చేసి దూషించిన వారిపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. మొత్తం 13 మందిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు.
Similar News
News March 19, 2025
NLG: చేనేత కార్మికులు దరఖాస్తు చేసుకోవాలి

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు కోసం అర్హత గల చేనేత కార్మికులకు నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు చేనేత, జౌళి శాఖ సహాయ డైరెక్టర్ ఎస్.ద్వారక్ తెలిపారు. చేనేత, డిజైన్ వృత్తిలో పని చేస్తున్న వారికి ఈ అవార్డు ఇస్తున్నట్లు తెలిపారు. ఎంపికైన వారికీ రూ.10 వేల నగదు పురస్కారంతో పాటు ప్రశంసాపత్రం, జ్ఞాపిక బహుకరిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఏప్రిల్ 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
News March 19, 2025
ఇంటర్ పరీక్షల సరళిని పరిశీలించిన జనగామ కలెక్టర్

జనగామ పట్టణ కేంద్రంలోని సాంఘిక సంక్షేమ పాఠశాల, జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్ పరీక్ష సరళిని కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ బుధవారం పరిశీలించారు. కళాశాలలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల గురించి, పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు సెంటర్లో ఏర్పాటు చేసిన మౌలిక వసతులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీఐఈఓ జితేందర్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ రావు తదితరులున్నారు.
News March 19, 2025
కమనీయం.. భద్రాద్రి రామయ్య నిత్యకల్యాణం

భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారి నిత్యకళ్యాణ వేడుక బుధవారం వేద పండితులు కమనీయంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేసి, స్వామివారిని బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించి, స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకళ్యాణ వేడుకను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.