News January 17, 2026
సావిత్రి గౌరీ నోము ఎలా ఆచరించాలి?

మట్టితో చేసిన దేవతా మూర్తుల బొమ్మలను ఓ పీఠంపై ఉంచి, వాటి మధ్యలో పసుపుతో చేసిన గౌరీదేవిని పూజించాలి. నూతన వధువులు ఈ వ్రతాన్ని వరుసగా 9 రోజుల పాటు భక్తితో ఆచరిస్తే శుభం కలుగుతుందని నమ్మకం. రోజూ అమ్మవారికి 9 రకాల పిండివంటలను నైవేద్యంగా సమర్పించాలి. ముత్తయిదువులను పేరంటానికి పిలిచి పండ్లు, తాంబూలం వాయనంగా ఇవ్వాలి. తొమ్మిదో రోజు పూజ పూర్తయ్యాక, ఆ మట్టి బొమ్మలను పుణ్యతీర్థాలలో నిమజ్జనం చేయాలి.
Similar News
News February 21, 2026
RITES లిమిటెడ్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<
News February 21, 2026
మామిడి: ఈ దశలో కాయ తొలిచే పురుగు ముప్పు మొదలు

మామిడి కాయలు నిమ్మ సైజు కంటే పెద్దవయ్యే దశ నుంచి కాయ తొలిచే పురుగులు కాయల తొడిమలు, రెండు కాయలు కలసి ఉన్నచోట గుడ్లు పెడతాయి. వీటి నుంచి వచ్చిన పురుగులు కాయలను తొలిచి తింటూ అవి పగిలి, రాలి పోవడానికి కారణమవుతాయి. ఈ పురుగులను గుర్తిస్తే లీటరు నీటికి క్లోరిఫైరిఫాస్(50 ఇ.సి) 1ml మరియు వేప మందు (10,000 ppm) 2ML కలిపి పిచికారీ చేయాలి. పండుఈగ కట్టడికి ఎకరాకు 8-10 మిథైల్ యూజీనాల్ ట్రాప్స్ అమర్చాలి.
News February 21, 2026
తిరుమలలో నిత్యం కల్యాణమే..

తిరుమల శ్రీవారికి నిత్య కల్యాణం జరుగుతుంది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామికి అర్చకులు రోజూ అత్యంత వైభవంగా వివాహం జరుపుతారు. భక్తుల దాంపత్య సౌఖ్యం కోసం ఈ సేవ నిర్వహిస్తారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా ఈ క్రతువు జరుపుతారు. ఈ కళ్యాణమహోత్సవం చూడడానికి భక్తులకు కన్నుల పండువగా ఉంటుంది. ఈ సేవలో పాల్గొన్న గృహస్థులకు స్వామివారి ఆశీస్సులతో పాటు వస్త్ర బహుమానం, ప్రసాదం లభిస్తాయి.


