News March 22, 2024

సింగరాయకొండ: ముగ్గురు వాలంటీర్లపై వేటు

image

ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన ముగ్గురు వాలంటీర్లపై తొలగింపులు కొనసాగుతున్నాయి. బుధవారం సింగరాయకొండలో మంత్రి సురేశ్, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు పొన్నూరి సురేశ్, సిరిమల్లె మణికంఠ, దేపూరి శివయ్య పాల్గొన్నారు. దీనిపై అధికారులు స్పందించి.. విధుల నుంచి తొలగించినట్లు ఎంపీడీవో నగేశ్ కుమారి చెప్పారు. ఇప్పటికే జిల్లాలో పదుల సంఖ్యలో తొలగింపులు జరిగాయి.

Similar News

News July 1, 2024

ప్రకాశం: వెబ్‌సైట్లో టెన్త్ మార్కుల జాబితా

image

పదోతరగతి మార్కుల జాబితా www.bse.ap.gov.in వెబ్‌సైట్లో పొందుపరిచినట్లు డీఈవో సుభద్ర ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని పాఠశాలల యాజమాన్యాల ప్రధానోపాధ్యాయులు పాఠశాల లాగిన్ ద్వారా విద్యార్థుల హాల్ టికెట్ ఉపయోగించి మార్కుల జాబితాను పొందవచ్చని పేర్కొన్నారు. మార్కుల జాబితాలో ఏదైనా తప్పులు ఉంటే విద్యార్థులు సరైన రికార్డులతో నేరుగా ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులకు తెలియజేయాలన్నారు.

News July 1, 2024

కురిచేడు: ఆలస్యంగా వెలుగులోకి మృతదేహం

image

కురిచేడు మండలంలోని దేకనకొండ గ్రామ పొలాల్లో ఓ వ్యక్తి మృతదేహం ఆదివారం లభ్యమైనట్లు ఎస్సై శ్రీకాంత్‌ తెలిపారు. మృతుడు తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా గోపాలపేటకు చెందిన అయినవోని లక్ష్మయ్య (55)గా గుర్తించినట్లు ఎస్సై తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నుంచి దర్శికి బతుకుదెరువు కోసం అతను వచ్చినట్లు తెలిసింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

News July 1, 2024

ముండ్లమూరు: చేపలు పట్టేందుకు వెళ్లి.. 

image

బావిలో పడి వ్యక్తి మృతిచెందిన ఘటన ముండ్లమూరు మండలంలోని వేములలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వినుకొండ నాగరాజు (48) చెరువు వద్ద బావిలో చేపలు పట్టేందుకు వెళ్లాడు. ఆసమయంలో ప్రమాదవశాత్తూ కాలు జారి బావిలో పడి మృతిచెందాడు. సమాచారం అందుకున్న గ్రామస్థులు చెరువు వద్దకు వెళ్లి మృతదేహాన్ని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. నీరు పూర్తిగా బయటకు వెళ్తేనే మృతదేహం లభ్యమవుతుందని తెలిపారు.