News February 20, 2025
సింగరేణి కార్మికులకు రూ.కోటి అదనపు ప్రమాద బీమా

సింగరేణి కార్మికులకు యాజమాన్యం రూ.కోటి రూపాయల ప్రమాద బీమా అదనపు సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు 4జాతీయ బ్యాంకులు SBI,UBI, కెనరా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడాలతో ఒప్పందం కుదురుచుకున్నట్లు వెల్ఫేర్ జీఎం పర్సనల్ తెలిపారు. సింగరేణి ఉద్యోగులు సంబంధిత బ్యాంకుల నుంచి వేతనం ఖాతాలు తీసుకోవాలని సూచించారు. ఉద్యోగులు తమ వేతనాల ఖాతాలను సంబంధిత బ్యాంకు శాఖలలో తీసుకోవాలన్నారు.
Similar News
News September 14, 2025
HYD: కృష్ణా జలాలపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష

సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్లో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 23 నుంచి ఢిల్లీలో జరిగే కృష్ణా జలాల ట్రిబ్యునల్ విచారణలో రాష్ట్రం తరఫున బలమైన వాదనలు వినిపించే వ్యూహంపై చర్చించారు. ఈ సమావేశానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సీఎస్. వైద్యనాథన్, సీడబ్ల్యూసీ మాజీ ఛైర్మన్ వోహ్రా, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
News September 14, 2025
ప్రకాశం నూతన ఎస్పీ.. తిరుపతిలో ఏం చేశారంటే?

ప్రకాశం జిల్లా నూతన SPగా హర్షవర్ధన్ రాజు నియమితులు కానున్నట్లు తెలుస్తోంది. ఇటీవల తిరుపతి SPగా బాధ్యతలు స్వీకరించిన ఆయన.. TTD CVSOగా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. తిరుపతి SPగా విధుల సమయంలో రాత్రి వేళ నైట్ విజన్ డ్రోన్లు రంగంలోకి దించి గంజా బ్యాచ్ అంతు చేశారు. తిరుపతి హోమ్ స్టేల కోసం నూతన యాప్ ప్రవేశపెట్టి తన మార్క్ చూపించారు. ఈయన తిరుపతికి ముందు కడప జిల్లాలో ఎస్పీగా పనిచేశారు.
News September 14, 2025
GWL: మావోయిస్టు పోతుల కల్పన కుటుంబ నేపథ్యం

గద్వాల జిల్లా గట్టు మండలం పెంచికలపాడుకు చెందిన మావోయిస్టు మహిళా నేత పోతుల కల్పన @ సుజాత తండ్రి కొంత కాలం కిందట మరణించాడు. తల్లి ముగ్గురు సోదరులు, ఒక సోదరి ఉన్నారు. 43 ఏళ్ల మావోయిస్టు ఉద్యమ జీవితంలో ఒక్కసారి మాత్రమే ఆమె స్వగ్రామానికి వచ్చినట్లు సమాచారం. అటు తరువాత కుటుంబ సభ్యులను, సన్నిహితులను ఎప్పుడూ కలవలేదు. అనేకసార్లు ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్న ఆమె అనారోగ్యం కారణంగా పోలీసుల ఎదుట లొంగిపోయారు.