News January 25, 2026

సింగరేణి కార్మికులపై పన్ను భారం తగ్గించాలని వినతి

image

సింగరేణి కార్మికుల సమస్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి ఛైర్మన్ జనక ప్రసాద్ తీసుకెళ్లారు. ఆదివారం కొత్తగూడెంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భూగర్భ గనుల్లో ప్రాణాలకు తెగించి పనిచేసే కార్మికులకు ఆదాయపన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. కోల్ ఇండియాలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సింగరేణిలోనూ వర్తింపజేయాలని వినతి పత్రం అందజేశారు.

Similar News

News February 12, 2026

NRPT: తగ్గిన పోలింగ్ పర్సంటేజ్ అభ్యర్థుల్లో టెన్షన్

image

నారాయణపేట మున్సిపాల్టీ పరిధిలో నిన్న జరిగిన ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజ్ తగ్గడంతో పోటీ చేసిన అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. వార్డుల్లో అనుకున్నదానికంటే తక్కువ పోలింగ్ పర్సంటేజ్ నమోదు కావడంతో ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయి అనేది అనుచరులు, ముఖ్య నాయకులతో కలిసి లెక్కలు వేసుకుంటున్నారు. మొత్తం 24 వార్డులకు గాను 96 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వీరిలో 21మంది స్వతంత్రులుగా పోటీ చేశారు.

News February 12, 2026

నమీబియాతో మ్యాచ్.. ప్రయోగాలు చేస్తారా?

image

USAపై గెలిచిన టీమ్ ఇండియా ఇవాళ T20 WCలో రెండో మ్యాచ్ నమీబియాతో ఆడనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో 7pmకు మొదలయ్యే మ్యాచులో పలు ప్రయోగాలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో కోచ్ గంభీర్ సానూకూలంగా ఉండటంతో శాంసన్‌ను తుది జట్టులోకి తీసుకోనున్నట్లు సమాచారం. బుమ్రాకు రెస్ట్ కొనసాగించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అటు అభిషేక్ ఫిట్‌నెస్‌పై ఇంకా క్లారిటీ లేకపోగా టీమ్11లో ఉంటాడా అనేది అనుమానమే.

News February 12, 2026

బ్రిటీష్ అధికారికి స్వామివారి దర్శనం

image

బ్రిటీష్ కాలంలో సర్ థామస్ మన్రో అనే అధికారి మంత్రాలయ మఠం భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని భావించారు. అయితే, ఆశ్చర్యకరంగా రాఘవేంద్ర స్వామి బృందావనం నుంచి బయటకు వచ్చి మన్రోకు దర్శనమిచ్చారు. ఆయనతో చర్చించి భూములను స్వాధీనం చేసుకోకుండా ఒప్పించారు. ఈ సంభాషణ గురించి మన్రో స్వయంగా ‘మద్రాస్ గెజిట్’లో నమోదు చేయడం విశేషం. ఓ పరాయి దేశస్థుడికి కూడా దర్శనమిచ్చిన స్వామివారి కరుణా సాగరం అనంతమైనది.