News September 16, 2025

సింగరేణి: ఖనిజ అన్వేషణలకు లైసెన్సులు జారీ

image

కొత్తగూడెం: సింగరేణి సంస్థ కర్ణాటక రాష్ట్రంలోని దేవదుర్గ ప్రాంతంలో బంగారం, రాగి ఖనిజాల అన్వేషణ చేయడానికి అనుమతిస్తూ.. జారీచేసిన లైసెన్సులను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్‌నకు అందజేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని టీ హబ్‌లో కేంద్ర గనుల శాఖ ఆధ్వర్యంలో జరిగిన కీలక ఖనిజాల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సెమినార్లో వీటిని అందజేశారు.

Similar News

News September 17, 2025

ఉద్యమాల పురిటి గడ్డ.. మెదక్ జిల్లా

image

నిజాం రాచరిక పాలన నుంచి విముక్తి కల్పించి HYD సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేసేందుకు జరిగిన ఉద్యమాల్లో మెదక్‌ నుంచి ఎందరో యోధులు పాల్గొన్నారు. వారి త్యాగాల ఫలితంగా 1948 SEC 17న HYD సంస్థానం దేశంలో విలీనమైంది. 1947 AUG 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చినా HYD సంస్థానం దేశంలో అంతర్భాగం కానీ పరిస్థితుల్లో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో మెదక్‌‌ నుంచి మగ్దూం మోయినోద్దీన్, కేవల్ కిషన్ తదితరులు పాల్గొన్నారు.

News September 17, 2025

సిద్దిపేట: ‘నెత్తురు చిందించిన నేల బైరాన్‌పల్లి’

image

రజాకార్ల ఆగడాలను భరించలేక పిడికిళ్లు బిగించి నిజాంల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. వడిశెల రాళ్లతో రజాకార్లకు జవాబు చెప్పిన యోధులను కన్న ఊరు బైరాన్ పల్లి. రజాకార్లకు ఎదురు నిలిచి నెత్తురు చిందించిన పల్లెల్లో ఒకటి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో బైరాన్ పల్లిలో రజాకార్లు జరిపిన దాడిలో 119 మంది యోధులు నేలకొరిగారు. ఈ మారణకాండ అమృత్ సర్‌లో జరిగిన జలియన్ వాలాబాగ్ ఘటనను గుర్తుచేసింది.

News September 17, 2025

MDK: దున్నేవాడికే భూమిని పంచిన వ్యక్తి ‘కేవల్ కిషన్’

image

మెదక్ ప్రాంతంలోని జమిందారుల ఆగడాలతో విసిగి వేసారిన పేదలను ఒక్కటి చేశారు ఆయనే మెదక్ జిల్లా చిన్నశంకరంపేటకు చెందిన కేవల్ కిషన్. ప్రజా పోరాటాలు చేసి భూ పోరాటాలతో నిజాం సర్కార్‌ను గడగడలాడించారు. స్వాతంత్ర్యం అనంతరం కూడా తన పంథాను మార్చుకోలేదు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో దున్నేవాడికే భూమి అంటూ పేదలకు భూములు పంచి పెట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.