News February 11, 2026
సింగరేణి సీఎండీగా జ్యోతి బుద్ధ ప్రకాశ్

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నూతన ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా సీనియర్ ఐఏఎస్ అధికారి డా.జ్యోతి బుద్ధ ప్రకాశ్ నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా ఉన్న ఆయనను బదిలీ చేసి సింగరేణి బాధ్యతలు అప్పగించారు. ఇప్పటి వరకు ఇన్-ఛార్జ్ సీఎండీగా ఉన్న డి.కృష్ణభాస్కర్ను ప్రభుత్వం ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేసింది.
Similar News
News February 21, 2026
శ్రీకాకుళం: మహిళ పొట్ట నుంచి 3.3 కిలోల కణితి తొలగింపు

కడుపు నొప్పితో బాధపడుతూ శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి శనివారం వచ్చింది. పరీక్షించిన వైద్యులు కడుపులో కణితి ఉన్నట్లు గుర్తించారు. అనంతరం శస్త్ర చికిత్స చేసి 3.3 కిలోల కణితిని ఆ మహిళ పొట్ట నుంచి బయటకు తీశారు. పేషంట్ పూర్తిస్థాయిలో ఆరోగ్యంగా ఉన్నారని, అరుదైన శస్త్ర చికిత్స విజయవంతంగా చేశామన్నారు.
News February 21, 2026
జగిత్యాల: ఉపాధ్యాయుల సర్వీసు వివరాల పరిశీలన

జిల్లాలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సర్వీస్ రెగ్యులరైజేషన్, ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రక్రియకు సంబంధించి ఈ నెల 26 నుంచి 28 వరకు, అలాగే మార్చి 2న సర్వీసు వివరాల పరిశీలన నిర్వహించనున్నట్లు డీఈవో రాము తెలిపారు. జగిత్యాల (అర్బన్) ఎంఆర్సీలో ఈ ప్రక్రియ జరుగుతుందని అన్నారు. జాబితాలో పేర్లు ఉన్న ఉపాధ్యాయులు తమ ఒరిజినల్ సర్వీస్ రిజిస్టర్, ధ్రువపత్రాలు, నిర్ణీత ప్రొఫార్మాలతో తప్పనిసరిగా హాజరుకావాలన్నారు.
News February 21, 2026
మదనపల్లె మృగాడు మృతి.. CM ఏమన్నారంటే?

AP: మదనపల్లె హత్యాచార నిందితుడు కులవర్ధన్ ఆత్మహత్యపై CM చంద్రబాబు వినుకొండ సభలో స్పందించారు. ‘మదనపల్లెలో గంజాయి సేవించి మానవ మృగంగా ప్రవర్తించాడు. ఆడబిడ్డల జోలికొస్తే అది వారికి చివరి రోజు అవుతుందని హెచ్చరించా. చట్టం కఠినంగా వ్యవహరిస్తుందన్న భయంతో అతను ప్రాణాలు తీసుకున్నాడు’ అని చెప్పారు. ఘటన అనంతరం నిందితుడు ఆత్మహత్య చేసుకోగా మృతదేహాన్ని తీసుకోవడానికి కుటుంబీకులు ముందుకు రాని విషయం తెలిసిందే.


