News August 14, 2025

సింగూరు డ్యామ్‌కు డేంజ‌ర్ బెల్స్: KTR

image

సింగూరు డ్యామ్ అత్యంత ప్రమాదకరస్థితిలో ఉందని, దీనిపై తక్షణం స్పందించి రక్షణ చర్యలు చేపట్టాలని నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ(ఎన్‌డీఎస్‌ఏ) హెచ్చరించిన నేప‌థ్యంలో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. మొన్న జూరాల ప్రాజెక్టుకు ప్రమాద ఘంటికలు, నిన్న మంజీరా బ్యారేజీకి పొంచి ఉన్న ముప్పు, నేడు సింగూరు డ్యామ్‌కు డేంజ‌ర్ బెల్స్ మోగాయ‌ని కేటీఆర్ ఆరోపించారు.

Similar News

News August 14, 2025

నిర్మల్: వలకు చిక్కిన ‘బొచ్చె’డంత ‘చేప’!

image

నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రానికి చెందిన దూసం సాయినాథ్ అనే మత్స్యకారుడికి అరుదైన చేప లభ్యమైంది. గురువారం పోచంపాడు డ్యాంలో అతడు చేపల వేటకు వెళ్లగా సుమారు 25 కిలోల భారీ బొచ్చె చేప వలకు చిక్కింది. కుబీర్ వారసంతకు ఆ చేపను అమ్మకానికి తీసుకురావడంతో ప్రజలు ఆసక్తిగా చూశారు. ఇలాంటి రకమైన చేపలు అరుదుగా దొరుకుతాయని సాయినాథ్ తెలిపాడు. ఇప్పటివరకు మీరు చూసిన అతి భారీ చేప ఏది? ఎన్ని కిలోలు? ఎంత ధర పలికింది?

News August 14, 2025

అత్యవసరం ఉంటే తప్ప బయటకి రావద్దు: జిల్లా కలెక్టర్

image

భారీ వర్షాలు కురుస్తుండడంతో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏదైనా అత్యవసరం పని ఉంటే తప్ప ఇండ్ల నుంచి బయటకు రావద్దని కలెక్టర్ విజయేంద్ర బోయి ప్రజలను కోరారు. బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి జలమయమైన ప్రాంతాలను పరిశీలించారు. సహాయక చర్యల్ని వేగవంతం చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.

News August 14, 2025

క్లౌడ్ బరస్ట్.. 22 మంది మృతిపై PM మోదీ దిగ్భ్రాంతి

image

J&Kలోని కిష్త్వార్ ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ వల్ల 22మంది మృతిచెందడంపై PM మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనాస్థలిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షిస్తున్నట్లు వివరించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. బాధితులకు అవసరమైన ఏ సాయాన్ని అందించడానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. మరోవైపు అమిత్ షా సైతం J&K CM ఒమర్ అబ్దుల్లాకు ఫోన్ చేసి ఘటనపై ఆరా తీసి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.