News January 5, 2026

సింగూరు ప్రాజెక్టులో 20 లక్షల చేప పిల్లల విడుదల

image

సింగూరు ప్రాజెక్టులో మత్స్యకారుల ఉపాధి కోసం 20 లక్షలు చేప పిల్లలను వదలనున్నట్లు మత్స్య శాఖ జిల్లా సహాయ సంచాలకులు ఆర్ఎల్. మదుసూదన్ తెలిపారు. సోమవారం సింగూరు ప్రాజెక్టులో ఈ ఏడాదికి మొదటి విడతగా 2.70 లక్షలు చేప పిల్లలను వదిలినట్లు తెలిపారు. దఫాలు, దఫాలుగా ప్రాజెక్టులో మొత్తం 20 లక్షల చేప పిల్లలను వదలనున్నామన్నారు. చేప పిల్లలు పెరిగి పెద్దయ్యాక మత్స్యకారులు ఉపాధి పొందవచ్చన్నారు.

Similar News

News January 8, 2026

రెండేళ్లలోపే ₹3.02 లక్షల కోట్ల అప్పు: జగన్

image

AP: 2019లో చంద్రబాబు దిగిపోయే నాటికి ₹3,90,247 కోట్ల అప్పు ఉందని వైసీపీ చీఫ్ జగన్ తెలిపారు. ‘మా హయాంలో ₹3,32,671 కోట్ల రుణాలు తీసుకుంటే ₹2,73,000 కోట్లు డీబీటీ ద్వారా ప్రజలకు అందించాం. చంద్రబాబు ఇప్పుడు రెండేళ్లలోపే ₹3,02,303 కోట్ల అప్పు చేశారు. కానీ అదంతా ఏం చేశారో తెలియదు. మేం సంక్షేమానికి క్యాలెండర్ రిలీజ్ చేస్తే బాబు అప్పులకు క్యాలెండర్ రిలీజ్ చేశారు’ అని ఎద్దేవా చేశారు.

News January 8, 2026

మహబూబాబాద్ ఆసుపత్రిలో సైకో వీరంగం

image

మహబూబాబాద్‌ జిల్లా ఆసుపత్రిలో గురువారం బిహార్‌కు చెందిన ఓ వ్యక్తి కత్తులతో హల్‌చల్ చేశాడు. వైద్యం కోసం వచ్చిన ఆ వ్యక్తి ఒక్కసారిగా సైకోలా మారి ఆసుపత్రిలోని వస్తువులను ధ్వంసం చేస్తూ, కత్తితో పొడుస్తానంటూ రోగులను బెదిరించాడు. దీంతో రోగులు ప్రాణభయంతో పరుగులు తీశారు. అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లి గొంతు కోసుకోవడానికి ప్రయత్నించగా, సెక్యూరిటీ సిబ్బంది తలుపులు పగలగొట్టి అతడిని బంధించారు.

News January 8, 2026

క్రమ పద్ధతిలో హిందువులపై దాడులు: షేక్ హసీనా

image

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను భారత్‌లో ఆశ్రయం పొందుతున్న ఆ దేశ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా తీవ్రంగా ఖండించారు. అక్కడ మైనారిటీలపై ఒక క్రమ పద్ధతిలో దాడులు జరుగుతున్నాయని NDTVతో చెప్పారు. ఈ హింసను యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వమే అనుమతిస్తోందని ఆరోపించారు. ప్రజలకు రక్షణ కల్పించే విషయంలో సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు. శిక్ష పడుతుందనే భయం దోషుల్లో లేకుండా పోయిందన్నారు.