News August 17, 2024
సింహాచలంలో ఆ సేవ పున:ప్రారంభం

సింహాచలంలో సహస్రనామార్చన సేవ తిరిగి ప్రారంభించారు. అంతరాలయంలో రోజూ జరిగే ఈ సేవను కొవిడ్ సమయంలో 2020లో నిలిపివేశారు. భక్తుల నుంచి పలు విన్నపాలు రావడంతో ఈ సేవను శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభించారు. ఈవో శ్రీనివాసమూర్తి దంపతులు రూ.500 టికెట్ కొనుగోలు చేసి సేవలో పాల్గొన్నారు. ఆలయ ఆస్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు అప్పన్న సన్నిధిలో ఈ సేవను జరిపించారు.
Similar News
News July 7, 2025
విశాఖ: పోలీస్ సిబ్బందికి ఏసీ హెల్మెట్లు అందజేత

ఆర్కే బీచ్ వద్ద పోలీస్ విభాగానికి వివిధ సంస్థలు, ప్రభుత్వం సమకూర్చిన ఏసీ హెల్మెట్లు, టూవీలర్స్, ఇతర సామగ్రిని హోం మంత్రి వంగలపూడి అనిత సోమవారం అందజేశారు. పోలీస్ సిబ్బందికి మౌలిక వసతులు అందిస్తే మరింత సమర్థవంతంగా పనిచేస్తారని ఆమె అన్నారు. దాదాపు రూ.70 లక్షలతో 20 హెల్మెట్లు, 64 ద్విచక్ర వాహనాలు, రెండు కెమెరాలు అందజేసినట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు.
News July 7, 2025
ఆనందపురం: లారీని ఢీకొన్న కారు.. తండ్రి మృతి, కుమారుడికి గాయాలు

ఆనందపురం జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పార్వతీపురం జియమ్మవలసకు చెందిన కరకవలస రమణమూర్తి తన కుమారుడితో కలిసి కారులో మద్దిలపాలెంలోని అల్లుడు ఇంటికి వస్తున్నారు. ఆనందపురం హైవే బ్రిడ్జి వద్ద ఆగి ఉన్న లారీని వీరి కారు ఢీకొంది. రమణమూర్తి అక్కడికక్కడే చనిపోగా తీవ్ర గాయాలపాలైన సంతోష్ను ఆసుపత్రికి తరలించినట్లు ఆనందపురం సీఐ తెలిపారు.
News July 7, 2025
విశాఖ: ’10 వేల మంది మార్గదర్శులను గుర్తించాలి’

పీ-4 విధానానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి పని చేయాలని, జిల్లాలో గుర్తించిన బంగారు కుటుంబాల అవసరాలను తెలుసుకోవాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్షరేట్లో అధికారులతో సమావేశమయ్యారు. బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చే మార్గదర్శులను వారం రోజుల్లో గుర్తించాలని ఆదేశించారు. సచివాలయం పరిధిలో 50 బంగారు కుటుంబాల అవసరాలను గుర్తించాలన్నారు.