News May 9, 2024

సింహాచలంలో రేపే సింహాద్రి అప్పన్న చందనోత్సవం

image

సింహాచలం ఆలయంలో ఈనెల 10వ తేదీన జరగనున్న అప్పన్న బాబు చందనోత్సవం కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సుమారు లక్ష మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. సాయంత్రం 6 తర్వాత సింహగిరి పైకి భక్తులకు అనుమతి లేదని అధికారులు తెలిపారు. రూ.300, రూ.1000, రూ.1500 టికెట్లు తీసుకున్నవారికి దర్శన సమయాల స్లాట్లు కేటాయించారు. ఎన్నికల నియమావళి అమలులో ఉండడంతో ఈసారి ప్రోటోకాల్ దర్శనాలు లేవు.

Similar News

News September 27, 2025

VZM: రేపటి నుంచి అఖిల‌భార‌త డ్వాక్రా బ‌జార్‌

image

దేశ‌వ్యాప్తంగా ఉన్న ప్ర‌ముఖ స్వ‌యం స‌హాయ‌క సంఘాలు రూపొందించే ఉత్పత్తుల ప్ర‌ద‌ర్శ‌న‌కు అఖిల భార‌త డ్వాక్రా బ‌జార్ గొప్ప వేదిక‌గా నిలవ‌నుంద‌ని క‌లెక్ట‌ర్ రామ సుంద‌ర్ రెడ్డి పేర్కొన్నారు. త‌న ఛాంబ‌ర్‌లో మీడియాతో శ‌నివారం మాట్లాడారు. ఆదివారం నుంచి మ‌నంద‌రికీ అందుబాటులో విజ‌య‌న‌గ‌రంలో ప్రారంభంకానున్న ఈ ప్ర‌ద‌ర్శ‌న‌ను ప్ర‌జ‌లంతా స‌ద్వినియోగం చేసుకోవాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు.

News September 27, 2025

VZM: ఈ నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలు పెరిగే అవకాశం..!

image

జిల్లాలోని రాజాం నియోజ‌క‌వ‌ర్గంలో 17, బొబ్బిలిలో 27, చీపురుప‌ల్లిలో 4, గ‌జ‌ప‌తిన‌గ‌రంలో 3, నెల్లిమ‌ర్ల‌లో 4, విజ‌య‌న‌గ‌రంలో 61, ఎస్‌.కోట నియోజ‌క‌వ‌ర్గంలో 10 మొత్తం 126 పోలింగ్ కేంద్రాల్లో 1200 కంటే ఎక్కువ‌గా ఓట‌ర్లు ఉన్నారు. పోలింగ్ కేంద్రాల మార్పులు, త‌ర‌లింపులు, కొత్త కేంద్రాల ఏర్పాటుకు ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని DRO శ్రీనివాసమూర్తి స్పష్టం చేశారు.

News September 27, 2025

పొక్సో కేసులో వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్ష: SP

image

పొక్సో కేసులో జమ్ము నారాయణపట్నానికి చెందిన అప్పారావుకు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.5వేల జరిమానాను కోర్టు విధించిందని SP దామోదర్ శుక్రవారం తెలిపారు. 7 ఏళ్ల బాలికను ఇంట్లోకి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడనే తల్లి ఫిర్యాదు మేరకు.. పోలీసులు దర్యాప్తు చేపట్టి కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేశారన్నారు. నేరం రుజువు కావడంతో 10 నెలల్లోనే శిక్ష ఖరారైందన్నారు. బాధితురాలికి రూ.3లక్షల పరిహారం మంజూరైందన్నారు.