News December 29, 2025
సింహాచలంలో వైకుంఠ ద్వారం దర్శనానికి ఏర్పాట్లు పూర్తి

సింహాచలంలోని వైకుంఠ ద్వారం ద్వారా భక్తులకు దర్శనం కలిగించేందుకు ఏర్పాట్లన్నీ పూర్తి చేసామని ఆలయ ఈవో సుజాత ఏఈఓ తిరుమలేశ్వర్ రావ్ తెలిపారు. దేవస్థానం సిబ్బంది పోలీస్ శాఖ సమన్వయంతో భక్తులకు దర్శన ఏర్పాట్లు పార్కింగ్ వసతి అన్నిచోట్ల అందుబాటులో ఉండేలా చేశామన్నారు. అన్న ప్రసాద వితరణ అదనంగా చేపడుతున్నామని తెలిపారు
Similar News
News December 29, 2025
‘సంజీవని నిధి’కి విరాళాలు ఇవ్వండి.. విశాఖ కలెక్టర్ విజ్ఞప్తి

విశాఖ జిల్లాలోని పేదలకు, బాధితులకు అండగా నిలిచేందుకు ‘సంజీవని నిధి’కి స్వచ్ఛంద విరాళాలు అందించాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. నూతన సంవత్సర వేడుకల్లో పూలు, కేకులు, బహుమతులకు బదులుగా మానవత్వంతో ఈ నిధికి సాయం చేయాలని కోరారు. ఆసక్తి గల దాతలు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఖాతా (50100500766040, IFSC: HDFC0009179) ద్వారా విరాళాలు అందించి సామాజిక బాధ్యతను చాటుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
News December 29, 2025
వైజాగ్లో న్యూ ఇయర్ వేడుకలు.. కఠిన రూల్స్!

విశాఖలో న్యూఇయర్ వేడుకల కోసం పోలీస్ కమిషనర్ కఠిన మార్గదర్శకాలు విడుదల చేశారు. ఈవెంట్లకు ముందస్తు అనుమతి తప్పనిసరి అని.. పబ్స్, హోటళ్లలో CCTV కెమెరాలు, భద్రత ఉండాలని పేర్కొన్నారు. డ్రగ్స్, అశ్లీలతకు తావులేకుండా వేడుకలు జరుపుకోవాలని చెప్పారు. మహిళల రక్షణ కోసం ‘శక్తి టీమ్స్’ అందుబాటులో ఉంటాయని.. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడితే రూ.10,000 జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు.
News December 29, 2025
విశాఖకు 150 పర్యావరణహిత బస్సులు

కేంద్ర ప్రభుత్వ ‘పీఎం-ఈబస్ సేవ’ పథకం కింద రాష్ట్రానికి 750 విద్యుత్ బస్సులు కేటాయించగా.. ఇందులో విశాఖపట్నం నగరానికే అత్యధికంగా 150 బస్సులను అందిచనుండడం విశేషం. ఈ మేరకు ఆపరేటర్లను ఖరారు చేసేందుకు ఈఈఎస్ఎల్ (EESL) సంస్థ ఆర్టీసీకి లెటర్ ఆఫ్ అవార్డు జారీ చేసింది. త్వరలోనే పర్యావరణ హితమైన ఈ ఎలక్ట్రిక్ బస్సులు వైజాగ్ రోడ్లపై పరుగులు తీయనున్నాయి.


