News March 24, 2025

సింహాచలం అప్పన్న పెండ్లిరాట ఎప్పుడంటే?

image

సింహాచలం అప్పన్న స్వామివారి వార్షిక కళ్యాణం చైత్ర శుద్ధ ఏకాదశి అనగా వచ్చేనెల 8వ తేదీన నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన పెండ్లిరాట మహోత్సవాన్ని ఉగాది పర్వదినాన జనపనున్నారు. ఈనెల 30వ తేదీన సాయంత్రం సుముహూర్త సమయంలో పెండ్లిరాటను వేస్తారు. మండపంలో మధ్యాహ్నం నూతన పంచాంగ శ్రవణం అయిన తర్వాత ఈ పెండ్లిరాట మహోత్సవాన్ని నిర్వహిస్తారు.

Similar News

News March 26, 2025

విశాఖ అభివృద్ధిపై కలెక్టర్ నివేదిక.. అంశాలివే..!

image

➤ 98 ఎకరాల్లో 5 సోలార్ ప్లాంట్లు, 100 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు
➤ ట్రాఫిక్ నియంత్రణకు 72.82 కి.మీ. పొడవున 15 రహదారులు జూన్ నాటికి పూర్తి
➤ జీవీఎంసీ పరిధిలో ఐదు చోట్ల వర్కింగ్ విమెన్ హాస్టల్స్
➤ పరదేశిపాలెంలో రూ.70లక్షలతో కాలేజీ అమ్మాయిలకు హాస్టల్ భవనం నిర్మాణం
➤ రూ.కోటితో కేజీహెచ్ ఓపీ, క్యాజువాలటీ ఆధునీకరణ
➤ విశాఖ పోర్టులో క్రూయిజ్ టూరిజం ప్రారంభం
➤ బీచ్‌లో హోప్ ఆన్, హోప్ ఆఫ్ బస్సు సర్వీసులు

News March 26, 2025

విశాఖలో టమోటా రేటు ఎంతంటే?

image

విశాఖ 13 రైతు బజార్లో వ్యవసాయ మార్కెటింగ్ అధికారులు బుధవారం కూరగాయల ధరలను విడుదల చేశారు.(రూ/కేజీలలో) వాటి వివరాలు టమోటా రూ.16, ఉల్లి రూ. 23, బంగాళాదుంపలు రూ.16, తెల్ల వంకాయలు రూ.28, బెండ రూ.28, కాకర రూ.32, బీర రూ.38, క్యారెట్ రూ. 28/32, బీట్రూట్ రూ.24, బరబాటి రూ.25, గ్రీన్ పీస్ రూ.52, క్యాప్సికం రూ.38, పొటాల్స్ రూ. 48, బీన్స్ రూ.48, క్యాబేజీ రూ.10, కాలీఫ్లవర్ రూ.20, నిర్ణయించారు.

News March 26, 2025

విశాఖ సీపీ సూచన.. సీఎం చంద్రబాబు ఆదేశాలు..!

image

రాష్ట్రంలో డీ అడిక్షన్ సెంటర్లు పెంచాలని విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీ కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం చంద్రబాబు ఏర్పాటు చేసిన సమావేశంలో సూచించారు. ఒక్కో డ్రగ్‌కు ఒక్కో విధమైన ట్రీట్‌మెంట్ ఉంటుందన్నారు. సీఎం చంద్రబాబు స్పందిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేయాలని ఆదేశించారు. ఏ ప్రాంతంలో ఏ డ్రగ్ ఎక్కువగా వాడుతున్నారో తెలుసుకుంటే అక్కడ డీ అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేయొచ్చని అధికారులకు సూచించారు.

error: Content is protected !!