News July 7, 2025

సింహాచలం: ఆ రెండు రోజులు ఆర్జిత సేవలు రద్దు

image

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి స్వామి వారి దేవాలయంలో ఈనెల 9,10 తేదీలలో జరిగే గిరి ప్రదక్షిణ సందర్భంగా స్వామివారికి జరిగే ఆర్జిత సేవలను రద్దు చేశారు. నిత్య కళ్యాణోత్సవం, గరుడ సేవ, స్వర్ణపుష్పార్చన, తులసీదళార్చన వంటి సేవలను రద్దుచేసి సుప్రభాతం, ఆరాధన ఏకాంతంగా నిర్వహిస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు కోరారు.

Similar News

News July 7, 2025

మెదక్: ‘రైతులను ఆదుకోవాలి’

image

రాష్ట్ర ప్రభుత్వం ఫసల్ బీమా పథకాన్ని అమలు చేసి రైతులకు న్యాయం చేయాలని రైతు రక్షణ సమితి సభ్యులు డిమాండ్ చేశారు. సోమవారం మెదక్ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ రాజ్‌కు రైతు సమస్యలపై రైతు రక్షణ సమితి సభ్యులు వినతిపత్రం అందించారు. అతివృష్టి, అనావృష్టితో రైతులు నష్టపోతున్నారని, ఫసల్ బీమా పథకాన్ని అమలు చేసి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

News July 7, 2025

విశాఖ నుంచి బయలుదేరే పలు రైళ్లు రద్దు

image

కోటబొమ్మాలి రైల్వే లైన్లో ఇంటర్ లాకింగ్ పనులు నేపథ్యంలో విశాఖ నుంచి బయలుదేరే పలు రైలు రద్దు చేసినట్లు వాల్తే డివిజన్ డీసీఎం సందీప్ సోమవారం తెలిపారు. విశాఖ -గుణుపూర్ (58505/06), విశాఖ -బరంపూర్ (58531/32), విశాఖ -భువనేశ్వర్ ఇంటర్ సిటీ (22819/20), విశాఖ- పలాస ప్యాసింజర్ (67289/90), విశాఖ -బరంపూర్ ఎక్స్‌ప్రెస్ (18525/26) రైళ్ళు జూలై 11న రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు గమనించాలని సూచించారు.

News July 7, 2025

JGTL: కోరుట్ల నుంచి అరుణాచలానికి SPECIAL బస్సు

image

పౌర్ణమి సందర్భంగా కోరుట్ల నుంచి తిరువన్నమలై(అరుణాచలం)కి కోరుట్ల డిపో నుంచి సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ మనోహర్ తెలిపారు. రేపు బస్టాండ్ నుంచి బయలుదేరి 9న కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనం తరువాత రాత్రికి అరుణాచలానికి చేరుకుంటుంది. గిరిప్రదక్షిణ, దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో జోగులాంబ ఆలయ దర్శనం ఉంటుందని, పెద్దలకు రూ.5,000, పిల్లలకు రూ.3,800ల టికెట్ ధర నిర్ణయించామని తెలిపారు.