News March 25, 2026
సింహాచలం: చందనోత్సవం రోజున కార్యక్రమాలు ఇలా..

సింహాచలం చందనోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆరోజున వేకువ జాము ఒంటి గంటకు సుప్రభాత సేవ, 3 గంటలకు ఆలయ వ్యవస్థాప ధర్మకర్త తొలి దర్శనం ప్రారంభమవుతుంది. 3.30 గంటలకు ప్రభుత్వం నుంచి పట్టువస్త్రాలు, అనంతరం తితిదే వారి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. 4.15 నుంచి 4.30 గంటల లోపు మొదటి స్లాట్ వీఐపీ దర్శనాలు మొదలవుతాయి. 4 గంటల నుంచి దర్శనాలు ప్రారంభమవుతాయి.
Similar News
News April 5, 2026
వరంగల్ మార్కెట్ రేపు పున: ప్రారంభం

మూడు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పున: ప్రారంభం కానుంది. శుక్రవారం గుడ్ ఫ్రైడే, శని, ఆదివారం వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. దీంతో రేపు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా, ఉదయం 6 నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.
News April 5, 2026
ఖానాపూర్: బీజేపీ ఛైర్ పర్సన్.. బీఆర్ఎస్ వైస్ ఛైర్మన్

ఖానాపూర్ మున్సిపల్ పీఠంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఛైర్మన్ పదవిని బీజేపీ దక్కించుకోగా, వైస్ ఛైర్మన్ పదవి బీఆర్ఎస్కు దక్కింది. ఛైర్మన్గా బీజేపీకి చెందిన అంకం మౌనిక, వైస్ ఛైర్మన్గా బీఆర్ఎస్ కౌన్సిలర్ మహమ్మద్ షోహెబ్ ఎన్నికయ్యారు. రాజకీయ సమీకరణాల మధ్య సాగిన ఈ ఎన్నిక ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. నూతన పాలకవర్గానికి పలువురు నేతలు అభినందనలు తెలిపారు.
News April 5, 2026
MIకి శుభవార్త.. కోలుకున్న హార్దిక్!

అనారోగ్యం కారణంగా DCతో మ్యాచ్కు దూరమైన MI కెప్టెన్ హార్దిక్ కోలుకున్నట్లు సమాచారం. ఎల్లుండి రాజస్థాన్ రాయల్స్తో జరగనున్న మ్యాచ్లో ఆయన ఆడనున్నట్లు తెలుస్తోంది. కాగా KKRపై గెలిచిన ముంబై నిన్న DC చేతిలో ఓడిన విషయం తెలిసిందే.


