News September 10, 2025

సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఏర్పాటు ఎప్పుడో..?

image

సింహాచలం ఆలయానికి ట్రస్ట్ బోర్డు లేకపోవడంతో అధికారుల ఏకచత్రాధిపత్యం నడుస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. దేవస్థాన పాలనలో ట్రస్ట్ బోర్డు కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుత అనువంశిక ఛైర్మన్ అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్‌గా ఉన్న నేపథ్యంలో ఆ కుటుంబం నుంచి కొత్తవారికి అవకాశం ఇస్తారా?లేక ఆయనే కొనసాగుతారా అన్నది ఆసక్తిగా మారింది. అటు ట్రస్ట్ బోర్డులో చోటు కోసం పలువురు కూటమి నేతలు ఆశగా ఎదురు చూస్తున్నారు.

Similar News

News March 7, 2026

US-ఇరాన్ పోరు.. డిస్కౌంట్‌లో బంగారం!

image

US, ఇజ్రాయెల్-ఇరాన్ పోరు ప్రభావం బంగారంపైన పడింది. దుబాయ్‌లో వ్యాపారులు తమ స్టాక్స్ క్లియర్ చేసేందుకు ఔన్స్ బంగారానికి (31 గ్రాములు) దాదాపు 30 డాలర్ల డిస్కౌంట్‌‌కు అమ్మేసుకుంటున్నారు. విమానాల రద్దుతో ఎగుమతులకు అంతరాయం, హై షిప్పింగ్ ఛార్జెస్ వల్ల కొనుగోలుదారులు ఆసక్తి చూపకపోవడం ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. ఇక భారత్‌లో సమృద్ధిగా బంగారం నిల్వలు ఉన్నందున సరఫరాకు అంతరాయం కలిగినా ఇబ్బంది లేదు.

News March 7, 2026

వార్ ఎఫెక్ట్.. రెండేళ్ల గరిష్ఠానికి ఆయిల్ ధరలు!

image

ముడి చమురు ధర దాదాపు రెండేళ్ల గరిష్ఠానికి చేరింది. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 90 డాలర్లకు పెరిగింది. 2024 APR తర్వాత ఆ స్థాయి ధరలు పెరగడం ఇదే తొలిసారి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటికీ ధర 25% పెరిగింది. ఒక వారంలో ఈ రేంజ్‌ హైక్ చివరగా 2020 ఏప్రిల్‌లో నమోదైంది. ఇరాన్‌తో చర్చలకు ఛాన్స్ లేదని ట్రంప్ చెప్పడం, గల్ఫ్‌లో తగ్గని ఉద్రిక్తత, కువైట్ ఉత్పత్తిని తగ్గిస్తోందనే వార్తలతో ధరలకు రెక్కలొచ్చాయి.

News March 7, 2026

సర్వైకల్ క్యాన్సర్ నివారణకు HPV టీకా డ్రైవ్

image

జిల్లాలో సర్వైకల్ క్యాన్సర్ నివారణ లక్ష్యంగా HPV వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు. 14 ఏళ్లు నిండి 15వ ఏట అడుగుపెట్టే బాలికలకు ‘గార్డాసిల్-4’ టీకా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉంటుందని చెప్పారు. జిల్లాలో 19,704 మంది బాలికలను లక్ష్యంగా తీసుకుని ఈ కార్యక్రమం మూడు నెలలు కొనసాగుతుందని వెల్లడించారు.