News May 3, 2024

సింహాచలం: నేటి నుంచి చందనోత్సవ టిక్కెట్లు విక్రయాలు

image

సింహాచలం సింహాద్రి అప్పన్న చందనోత్సవం ఈనెల 10న జరగనున్న నేపథ్యంలో దీనికి సంబంధించి దర్శన టిక్కెట్లువిక్రయాలు శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి ప్రారంభించనున్నట్లు ఆలయ ఈఓ శ్రీనివాసమూర్తి తెలిపారు.ఈనెల 7వ తేదీ సాయంత్రం వరకు విక్రయాలు సింహాచలం మహారాణిపేట అక్కయ్యపాలెం యూనియన్ బ్రాంచ్ లలో టికెట్ల విక్రయాలు జరుగుతాయన్నారు.కొండపై కూడా టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. ఆన్లైన్ లో కూడా అందుబాటులో ఉంటాయన్నారు.

Similar News

News July 7, 2025

విశాఖ నుంచి బయలుదేరే పలు రైళ్లు రద్దు

image

కోటబొమ్మాలి రైల్వే లైన్లో ఇంటర్ లాకింగ్ పనులు నేపథ్యంలో విశాఖ నుంచి బయలుదేరే పలు రైలు రద్దు చేసినట్లు వాల్తే డివిజన్ డీసీఎం సందీప్ సోమవారం తెలిపారు. విశాఖ -గుణుపూర్ (58505/06), విశాఖ -బరంపూర్ (58531/32), విశాఖ -భువనేశ్వర్ ఇంటర్ సిటీ (22819/20), విశాఖ- పలాస ప్యాసింజర్ (67289/90), విశాఖ -బరంపూర్ ఎక్స్‌ప్రెస్ (18525/26) రైళ్ళు జూలై 11న రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు గమనించాలని సూచించారు.

News July 7, 2025

విశాఖ: ‘రాందేవ్ బాబాకు భూ కేటాయింపులు ఆపండి’

image

జీఓ 596కు విరుద్ధంగా ఫ్రీ హోల్డ్ చేసిన 6లక్షల ఎకరాల భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకుని తిరిగి ఎస్సీలకే కేటాయించాలని విదసం రాష్ట్ర కన్వీనర్ బూసి వెంకట రావు డిమాండ్ చేశారు. సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేశారు. శారదా పీఠం నుండి తీసుకున్న భూములు రామ్ దేవ్ బాబాకు ఇవ్వొద్దని, ఉమ్మడి విశాఖ జిల్లాలో భూ కుంభకోణాలపై వేసిన రెండు సిట్‌ల నివేదికలూ బయట పెట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

News July 7, 2025

విశాఖ: వైసీపీ ఎమ్మెల్సీకి బెయిల్ మంజూరు

image

వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణిపై మహారాణిపేట పోలీసులు కేసు నమోదు చేయగా బెయిల్ మంజూరు అయింది. గత నెల 23వ తేదీన నిర్వహించిన వైసీపీ యువత పోరు కార్యక్రమంలో ఆమె పాల్గొనడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై నోటీసులు ఇవ్వడంతో ఇవాళ మహారాణిపేట సీఐ భాస్కరరావు ఎదుట ఆమె విచారణకు హాజరయ్యారు. కోర్టు మంజూరు చేసిన బెయిల్ పత్రాలను సీఐకు సమర్పించారు.