News March 27, 2024
సింహాచలం: యజ్ఞంలో పాల్గొన్న పీఠాధిపతులు

సింహాచలం వరాహ లక్ష్మి నృసింహ ఆలయాన్ని విశాఖ శ్రీ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి సందర్శించారు. స్వామివారి సన్నిధిలో జరుగుతున్న సుదర్శన నరసింహ మహా యజ్ఞంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాగశాలలో పూజలు చేశారు. అనంతరం స్వామీజీలను వేద పండితులు ఆలయ ఈఓ శ్రీనివాసమూర్తి సత్కరించారు.
Similar News
News September 8, 2025
విశాఖ: ఉత్తరాంధ్ర జిల్లాల అధికారులతో అగ్నిమాపక డీజీ సమీక్ష

అగ్నిమాపక డైరెక్టర్ జనరల్ వెంకటరమణ ఉత్తరాంధ్ర జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. విశాఖలోని IIM క్యాంపస్లో జరిగిన సమావేశంలో NOC జారీ ప్రక్రియ సులభతరమైందని, కార్యాలయాలకు రాకుండా ఆన్లైన్ పోర్టల్ ద్వారా పొందుతున్నారన్నారు. ఈ జోన్లో మరో ఆరు అగ్నిమాపక కేంద్రాలను రూ.2.25 కోట్లతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. మరో రూ.13.9 కోట్లతో శిథిలావస్థలో ఉన్న భవనాల స్థానంలో కొత్తవి నిర్మిస్తామన్నారు.
News September 8, 2025
సాగర్ తీరంలో ముగిసిన ఫుడ్ ఫెస్టివల్

ఏపీ టూరిజం ఆధ్వర్యంలో సాగర్ తీరంలో 3 రోజులపాటు నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్ ఆదివారం రాత్రితో ముగిసింది. 40 ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయగా ఆదివారం రాత్రి జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, టూరిజం జేడీ మాధవి, ఇతర ఉన్నత అధికారులు తమ కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు. ఈ 3 రోజులు లక్షల మంది ఫెస్టివల్లో పాల్గొన్నట్లు అధికారులు చెబుతున్నారు.
News September 7, 2025
HPCLలో అగ్నిప్రమాదంపై స్పందించిన హోంమంత్రి అనిత

విశాఖలోని ఈస్ట్ ఇండియా పెట్రోల్ కార్పొరేషన్ లిమిటెడ్లో పిడుగు పడిన విషయం తెలిసిందే. అగ్ని ప్రమాదంపై స్పందించిన హోంమంత్రి అనిత అగ్నిమాపకశాఖ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మంటలు అదుపులోకి వచ్చాయని, ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొనసాగుతుందని ప్రజలెవరూ భయాందోళన చెందవద్దని పేర్కొన్నారు.