News August 19, 2025
సికింద్రాబాద్: దక్షిణ మధ్య రైల్వే చరిత్రలోనే రికార్డు

సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే చరిత్రలో మహిళలు రికార్డ్ సాధించారు. జోన్లోని 5 కీలకమైన వాణిజ్య, ఆపరేటింగ్, ఫైనాన్స్, సెక్యూరిటీ, వైద్య విభాగాలను మహిళా అధికారులు నిర్వహిస్తున్నారు. ఆపరేషన్స్ మేనేజర్గా కె.పద్మజ, భద్రత విభాగానికి అరోమాసింగ్ ఠాకూర్, ప్రధాన ఆర్థిక సలహాదారుగా హేమ సునీత, వాణిజ్యానికి కమర్షియల్ మేనేజర్గా ఇతి పాండే, ప్రిన్సిపల్ చీఫ్ మెడికల్ డైరెక్టర్గా నిర్మల నరసింహన్ ఉన్నారు.
Similar News
News August 20, 2025
EPFOలో 230 ఉద్యోగాలు.. గడువు పెంపు

EPFOలో 230 ఉద్యోగాల దరఖాస్తుకు గడువును పొడిగించారు. ఈనెల 18తో అప్లికేషన్ తేదీ ముగియగా 22 వరకు పెంచుతూ UPSC నిర్ణయం తీసుకుంది. ఇందులో ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు ఏదైనా డిగ్రీ పాసై, 35 ఏళ్లలోపు ఉండాలి. లెవెల్-8, లెవెల్-10 వేతన శ్రేణి కింద జీతాలు అందుతాయి.
వెబ్సైట్: <
News August 20, 2025
అందరి సహకారంతో మాదకద్రవ్యాల నిర్మూలన: కలెక్టర్

నల్గొండ జిల్లాలో మాదక ద్రవ్యాలను నిర్మూలించాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. జిల్లాలో మత్తుమందుల నివారణకు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని కోరారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్లో నిర్వహించిన జిల్లా స్థాయి మత్తుమందుల నివారణ జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ యువత మత్తుమందులకు బానిస కాకుండా అన్ని స్థాయిలలో అవగాహన కల్పించాలని అన్నారు.
News August 20, 2025
రోడ్డు ప్రమాదాల నివారణకు సమన్వయంతో పనిచేయాలి: కలెక్టర్

రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు కలిసికట్టుగా, సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి రోడ్డు భద్రత సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. వాహనాల వేగాన్ని నియంత్రించడం, రాత్రి సమయాల్లో ప్రమాదాలు జరగకుండా స్ట్రీట్ లైటింగ్ ఏర్పాటు చేయడం, మానవ తప్పిదాల వల్ల రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.