News July 18, 2024
సికింద్రాబాద్: ప్లాట్ ఫాం, రైలు మధ్యలో ఇరుక్కుని వ్యక్తి మృతి

గుర్తు తెలియని వ్యక్తి రైలు, ప్లాట్ ఫామ్ మధ్య ఇరుక్కుని అక్కడికక్కడే మృతి చెందిన ఘటన సికింద్రాబాద్ జీఆర్పీ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఓ గుర్తు తెలియని వ్యక్తి ప్లాట్ ఫామ్ నంబర్-3లో కాకతీయ ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కుతున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కింద పడటంతో ప్లాట్ ఫాం, రైలు మధ్యలో ఇరుక్కుపోయి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News February 11, 2026
3pm రంగారెడ్డి అప్డేట్.. దూసుకొచ్చిన ఆమన్గల్

RR మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఊపందుకుంది. 2 తర్వాత ఓటర్లు కేంద్రాలకు కదిలారు. జిల్లాలోని 6 మున్సిపాలిటీల్లో 1, 2 మినహా మిగతా వార్డుల్లో పోలింగ్ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. మ.3గం. వరకు జిల్లాలో 68.77% పోలింగ్ నమోదైంది. అత్యధికంగా ఆమనగల్లులో 76.33%, చేవెళ్ల 73.04% ఇబ్రహీంపట్నం 68.6%, మొయినాబాద్ 69.79, శంకర్పల్లి 65.19, షాద్నగర్లో 65.25% నమోదైంది. పోలింగ్కు మరో 1:10 గం. సమయం మిగిలి ఉంది.
News February 11, 2026
RR: 57.68%తో చేవెళ్ల టాప్.. మొత్తం ఎంతంటే!

జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కాస్త ఊపందుకుంది. 12 తర్వాత ఓటు వేసేందుకు ఓటర్లు కేంద్రాల వద్ద బారులు తీరారు. జిల్లాలోని 6 మున్సిపాలిటీల్లో 1, 2 మినహా మిగతా వార్డుల్లో పోలింగ్ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు జిల్లాలో 52.57% పోలింగ్ నమోదైంది. ఆమనగల్లు 54.4%, చేవెళ్ల 57.68,% ఇబ్రహీంపట్నం 52.73%, మొయినాబాద్ 49.67, శంకర్పల్లి 49.63, షాద్నగర్ 52.43% నమోదైంది.
News February 11, 2026
రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల టాప్

రంగారెడ్డి జిల్లాలోని 6 మున్సిపాలిటీల వ్యాప్తంగా ఉ.11గం. వరకు మొత్తం 30.11% పోలింగ్ నమోదైంది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 31.06%, ఆమనగల్లులో 25.58, చేవెళ్లలో 34.02, మెయినాబాద్లో 26.97, శంకర్పల్లిలో 32.05, షాద్నగర్లో 32.5% పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. యువత ఓటు హక్కుని వినియోగించుకుని ప్రజాసామ్య స్ఫూర్తిని చాటాలని సూచించారు. ఇప్పటివరకు చేవెళ్లలో ఇప్పటి వరకు అత్యధికంగా ఓటింగ్ నమోదైంది.


