News July 18, 2024
సికింద్రాబాద్: ప్లాట్ ఫాం, రైలు మధ్యలో ఇరుక్కుని వ్యక్తి మృతి

గుర్తు తెలియని వ్యక్తి రైలు, ప్లాట్ ఫామ్ మధ్య ఇరుక్కుని అక్కడికక్కడే మృతి చెందిన ఘటన సికింద్రాబాద్ జీఆర్పీ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఓ గుర్తు తెలియని వ్యక్తి ప్లాట్ ఫామ్ నంబర్-3లో కాకతీయ ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కుతున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కింద పడటంతో ప్లాట్ ఫాం, రైలు మధ్యలో ఇరుక్కుపోయి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News September 1, 2025
HYD: 9 రోజులుగా దొరకని అవయవాలు

మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి బోడుప్పల్లో గత నెల 24న భర్త హత్య చేసి, ముక్కలుగా మార్చి మూసీలో పడేసిన స్వాతి అవయవాలు ఇప్పటికీ లభించలేదు. 9 రోజులుగా DRF, హైడ్రా బృందాలు ప్రతాపసింగారం మూసీ వంతెన వద్ద జల్లెడ పట్టినా ఫలితం శూన్యమైంది. మూసీలో ఎక్కడా ఆనవాళ్లు కనిపించకపోవడంతో దర్యాప్తు మరింత క్లిష్టమైంది. గాలింపు యత్నాలు ఫలించకపోవడంతో కేసు సవాలు అవుతోంది.
News September 1, 2025
HYD: బీజేపీ నాటకంలో రేవంత్ రెడ్డి కీలుబొమ్మ: BRS MLA

బీజేపీ ఆడిస్తున్న నాటకంలో సీఎం రేవంత్ రెడ్డి కీలుబొమ్మగా ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుందని కుత్బుల్లాపూర్ BRS ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణను సీబీఐకి అప్పగించడం, రేవంత్ రెడ్డి చేసే పనితీరు తదితర విషయాలన్నీ గమనిస్తే ఇది తేటతెల్లమవుతున్నట్లుగా పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మడం లేదన్నారు.
News September 1, 2025
HYD వ్యాప్తంగా ఆర్టీసీ కార్గో సర్వీస్ హోమ్ డెలివరీ

HYD వ్యాప్తంగా ఆర్టీసీ కార్గో సర్వీస్ హోమ్ డెలివరీ చేస్తున్నట్లుగా రాష్ట్ర IPRD తెలిపింది. కేజీ వరకు బరువు కలిగిన పార్సెల్ రూ.50కు మాత్రమే HYD వ్యాప్తంగా డెలివరీ చేస్తున్నట్లుగా వివరించింది. ఆర్టీసీ కార్గో హోమ్ డెలివరీ సంబంధించి ఆర్టీసీ వెబ్సైట్, ఆర్టీసీ కార్గో సర్వీస్ సెంటర్లను సందర్శిస్తే సరిపోతుందని అధికారులు తెలిపారు.