News July 20, 2024

సికింద్రాబాద్ మహంకాళికి బోనం సమర్పించిన దీపాదాస్ మున్షీ

image

సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ, యూఎస్ కన్సులేట్ జనరల్ జెన్నిఫర్ ఎ.లార్సన్, మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని కోరుకున్నట్లు తెలిపారు. పార్టీ సనత్‌నగర్ ఇన్‌ఛార్జ్ కోట నీలిమ, నాయకులు పాల్గొన్నారు.

Similar News

News November 13, 2025

జరిమానా వేసే జీహెచ్ఎంసీకి కూడా జరిమానా

image

చెత్త, వ్యర్థాల నిర్వహణపై దుకాణదారులు, ప్రజలకు జరిమానా వేసే జీహెచ్ఎంసీకి కూడా జరిమానా పడింది. వేస్ట్ మేనేజ్‌మెంట్ సరిగా పాటించడం లేదంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్.. జీహెచ్ఎంసీకి రూ.లక్ష ఫైన్ విధించింది. సిటీలో ఉత్పత్తి అయ్యే చెత్తను ఇష్టానుసారంగా జవహర్‌నగర్‌లో డంపింగ్ చేస్తున్నారంటూ పలువురు ఎన్జీటీని ఆశ్రయించగా ఈ చర్యలు తీసుకొంది. చెత్త నిర్వహణ సక్రమంగా ఉండేలా చూడాలని ఆదేశించింది.

News November 13, 2025

జూబ్లీహిల్స్‌: పైసలిచ్చినా ఓటెయని వారి నుంచి వసూళ్లు!

image

జూబ్లీహిల్స్ ఓటింగ్ అందరినీ నిరాశకు గురిచేసింది. పోలింగ్ 50% నమోదు కాకపోవడంతో అసహనం వ్యక్తం అవుతోంది. డబ్బులు తీసుకొని కూడా ఓటు వేయని వారి ఇళ్లకు నాయకులు వెళ్లినట్లు చర్చ జరుగుతోంది. అపార్ట్‌మెంట్‌లో ఉండే సగం మంది బయటకు రాలేదని గుర్తించిన బూత్ కమిటీ సభ్యులు తీసుకున్న డబ్బులు వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. పోలింగ్ పర్సంటేజ్ తగ్గడంతో ఈ పరిస్థితి వచ్చినట్లు సమాచారం.

News November 13, 2025

HYD: ఔర్‌కుచ్ బాకీ హే క్యా?.. BRS మీద INC ట్రోల్స్

image

జూబ్లీహిల్స్ ఎగ్జిట్ పోల్స్‌ కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపడంతో ఆ పార్టీ నాయకులు BRS మీద ట్రోల్స్ మొదలుపెట్టారు. ‘ఎవ్వడికి వాడు కొడుతున్నాం.. కొడుతున్నాం అన్నారు. అసెంబ్లీ ఎలక్షన్‌లో కొట్టాం. పార్లమెంట్ ఎలక్షన్స్‌‌లో కొట్టాం. కంటోన్మెంట్ బైఎలక్షన్‌లో కొట్టాం. జూబ్లీహిల్స్‌లో కొడుతున్నాం. ప్రతిసారి కొట్టేది మేము అయితే కొట్టించుకునేది మీరు’ అంటూ BRSను ఉద్దేశించి కాంగ్రెస్ నేతలు SMలో ట్వీట్ చేస్తున్నారు.