News April 6, 2025

సికింద్రాబాద్: రైలులోని వాష్‌రూమ్‌లో అత్యాచారం (UPDATE)

image

రక్సెల్-సికింద్రాబాద్ రైలులోని వాష్‌రూమ్‌లో బాలికపై అత్యాచార ఘటనలో నిందితుడి ఫొటోలు బయటకొచ్చాయి. HYDను చూడడానికి ఫ్యామిలీతో కలిసి వస్తున్న బాలికపై బేగంపేటలో ఉండే <<15997705>>సంతోష్‌(బిహార్ వాసి)<<>> అత్యాచారం చేస్తూ వీడియో తీశాడు. ఈ ఫిర్యాదుతో పోక్సో కేసు కింద అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుపై పూర్తి నివేదిక పంపాలని తాజాగా DGP, RPF డీజీని జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ విజయ రహత్కార్‌ కోరారు.

Similar News

News April 7, 2025

HYD: అంబేడ్కర్ విగ్రహానికి బీజేపీ నేతల పుష్పాంజలి

image

బీజేపీ ఎమ్మెల్సీలు మల్కా కొమరయ్య, సీ.అంజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చింతల, NVSS ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు, బీజేపీ సీనియర్ నేతలు, కార్యకర్తలు సోమవారం ట్యాంక్‌బండ్ కూడలి వద్ద డాక్టర్ బీఆర్. అంబేడ్కర్ విగ్రహానికి పుష్పమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా శాసనమండలికి బయలుదేరారు.

News April 7, 2025

మన్యంకొండలో వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం..!

image

మన్యంకొండ శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాల్లో వైభవంగా జరుగుతున్నాయి. రాముడి కళ్యాణం అనంతరం ఈరోజు ఆనవాయితీ ప్రకారం ఆలయ ప్రాంగణంలోని దర్బార్ మంటపమైన లక్ష్మీ విలాసంలో శ్రీరాముడి పట్టాభిషేకానికి స్వామివారిని అలంకరించారు. శ్రీరామ మహా పట్టాభిషేక మహోత్సవ వేడుకలతో మన్యంకొండ పులకించింది. వేదమంత్రోచ్ఛరణల మధ్య సింహాసనాన్ని అధిష్ఠించిన రాములవారిని భక్తులు దర్శించుకున్నారు.  

News April 7, 2025

HYD: కంచ గచ్చిబౌలి విచారణ వాయిదా

image

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా ఈనెల 24వ తేదీలోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టులో కేసు విచారణ దృష్ట్యా 24వ తేదీలోపు కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. కంచ గచ్చిబౌలి భూములపై వట ఫౌండేషన్, HCU విద్యార్థులు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే.

error: Content is protected !!