News August 27, 2025

సికింద్రాబాద్ రైల్వే పరిసరాలు బురదమయం

image

HYD వ్యాప్తంగా భారీ వర్షం కురవటంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు బురదమయంగా మారాయి. రహదారులపై నీరు నిల్వ ఉండడంతో పాటు, ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగిస్తోంది. వర్షంలో సామాన్లతో నడుస్తున్న వారు జారిపడి ప్రమాదానికి గురవుతున్నారు. చుట్టూరా డ్రైనేజీ సమస్యలు సైతం ఇందుకు కారణంగా అక్కడి ప్రజలు తెలిపారు.

Similar News

News August 27, 2025

SRSP UPDATE: 3.50 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల

image

ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరదతో బుధవారం రాత్రి 10 గంటలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 39 స్పిల్వే వరద గేట్ల ద్వారా 3.50 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరి నదిలోకి వదిలారు. ప్రాజెక్టు దిగువన గోదావరి నదీ పరిసర ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోచంపాడ్ ఇరిగేషన్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ జగదీశ్ హెచ్చరించారు.

News August 27, 2025

జనగామ జిల్లాలో బుధవారం టాప్ న్యూస్!

image

> జిల్లా వ్యాప్తంగా ఘనంగా వినాయక చవితి వేడుకలు
> లింగాల గణపురం: తాడిచెట్టు పైనుంచి పడి వ్యక్తికి తీవ్ర గాయాలు
> జిల్లాకు ఆరెంజ్ అలర్ట్.. కలెక్టర్ కీలక ఆదేశాలు
> నేషనల్ అచీవ్‌మెంట్ సర్వేలో కొడకండ్ల కేజీవీబీ కీర్తి
> జఫర్గడ్: మట్టి వినాయకుడిని తయారుచేసిన బీవీ విద్యార్థులు
> గణేశుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి

News August 27, 2025

గోదావరి పరీవాహక ప్రజలు జాగ్రత్త!

image

TG: గోదావరి నదిపై నిజామాబాద్ జిల్లాలో ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద భారీగా పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం 2 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా అది 4 లక్షల నుంచి 5 లక్షల క్యూసెక్కులకు పెరిగే అవకాశం ఉందన్నారు. మంజీరా నది వరద అంతా SRSPలోకి రానుంది. అటు కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సైతం ప్రవాహం పెరగనుంది.