News February 23, 2026
సిక్కోలు జిల్లాకు ఎర్రన్న ఏమి చేశారంటే ?

కింజరాపు ఎర్రన్నాయుడు 1996లో కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రిగా ఉన్న సమయంలో రూ.32కోట్ల వ్యయంతో ఉద్దానం తాగునీటి ప్రాజెక్ట్ను మంజూరు చేయడంలో కీలక పాత్ర పోషించారు. జిల్లాలోని మారుమూల గ్రామీణ ప్రాంతాలకు సైతం అప్పటిలో రోడ్లు వేసి ఎర్రన్న మార్క్ వేశారు. 1999-2004 కాలంలో కేంద్ర రైల్వే స్టాండింగ్ కమిటీ ఛైర్మన్గా ఉన్న సమయంలో నౌపడ-గుణుపూర్ బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ అభివృద్ధి చేపట్టారు.
Similar News
News February 23, 2026
SKLM: ‘జాతీయ లోక్ అదాలత్ను వినియోగించుకోవాలి’

మార్చి 14న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ను వినియోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికారి సంస్థ ఛైర్మన్ జూనైద్ అహమ్మద్ మౌలానా పేర్కొన్నారు. సోమవారం జిల్లా కోర్టులో పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. పెండింగ్లో ఉన్న అత్యధికంగా కేసులు రాజీ చేసేందుకు అధికారులు ప్రయత్నం చేయాలని సూచించారు. మోటర్ యాక్సిడెంట్ కేసుల్లో ఇన్సూరెన్స్ సంస్థలు త్వరితగతిన న్యాయం చేయాలన్నారు. ASP రమణ ఉన్నారు.
News February 23, 2026
శ్రీకాకుళం: ప్రయాణికులకు గమనిక

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈస్ట్ కోస్ట్ రైల్వే శాఖ శుభవార్త తెలిపింది. శ్రీకాకుళం జిల్లా మీదుగా ప్రయాణించే భువనేశ్వర్-బెంగళూరు-భువనేశ్వర్ (రైలు నం.18463/64) ప్రశాంతి ఎక్స్ప్రెస్ రైలుకు 3వ ఏసీ భోగిని అదనంగా ఏర్పాటు చేయనున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే శాఖ జనరల్ మేనేజర్ పరమేశ్వర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రైలు శ్రీకాకుళం రోడ్డు, పలాస, సోంపేట, ఇచ్ఛాపురం తదితర రైల్వే స్టేషన్లలో ఆగనుంది.
News February 23, 2026
శ్రీకాకుళం: ‘ఇంటర్ పరీక్షకు 662 మంది డుమ్మా’

శ్రీకాకుళం జిల్లాలో సోమవారం మొదటి రోజు ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షకు 662 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఆర్ఐఓ ఆర్.సురేశ్ కుమార్ తెలిపారు. జిల్లాలోని 71 కేంద్రాల్లో 20,377 మంది పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 19,715 మంది హాజరైనట్లు తెలిపారు. 96.75 హాజరు శాతం నమోదు అయినట్లు ఆయన వెల్లడించారు. మొదటి రోజు పరీక్షలు ప్రశాంతంగా జరుగినట్లు, ఎక్కడా మాల్ ప్రాక్టీస్ నమోదు కాలేదన్నారు.


