News January 20, 2026
సిట్ ఎన్నిసార్లు పిలిచినా వెళ్తా: హరీశ్ రావు

TG: సిట్ ఎన్నిసార్లు పిలిచినా విచారణకు వెళ్తానని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ‘విచారణకు పిలిచి గంట ప్రశ్నలు అడగడం.. కాసేపు ఫోన్ వచ్చిందని బయటకు వెళ్లడం చేశారు. కోల్ మైన్ విషయంలో రేవంత్, భట్టి, కోమటిరెడ్డి మధ్య పంపకాల్లో తేడా వచ్చింది. ఈ అంశం డైవర్ట్ చేయడానికే డ్రామా ఆడుతున్నారు. దర్యాప్తు పేరుతో ఆడుతున్న నాటకాన్ని ప్రజలు గమనిస్తున్నారు. సీఎం రేవంత్ భాష వింటే రోత పుడుతోంది’ అని ఆయన అన్నారు.
Similar News
News February 3, 2026
అదానీ గ్రూప్ షేర్ల జోరు.. ఒక్కరోజే ₹లక్ష కోట్ల లాభం!

US టారిఫ్స్ను తగ్గిస్తున్నట్లు ప్రకటించడంతో అదానీ గ్రూప్ షేర్లు దూసుకెళ్లాయి. నేటి ట్రేడింగ్లో అదానీ గ్రీన్ ఎనర్జీ అత్యధికంగా 12.87% లాభపడగా అదానీ ఎంటర్ప్రైజెస్ 11.89%, అదానీ ఎనర్జీ 10% వరకు పెరిగాయి. సుంకాల తగ్గింపు వల్ల ఆ గ్రూప్ ఆదాయాలు పెరుగుతాయనే అంచనాలు ర్యాలీకి కారణమయ్యాయి. ఒక్క రోజులోనే అదానీ గ్రూప్ మొత్తం మార్కెట్ విలువ దాదాపు ₹లక్ష కోట్లకు పైగా పెరిగి ₹13.78 లక్షల కోట్లకు చేరుకుంది.
News February 3, 2026
రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే..

రోజూ రాత్రి నిద్రపోయే ముందు ఓ లవంగం మొగ్గను నమిలితే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందంటున్నారు. ఒత్తిడి తగ్గి మంచి నిద్ర వస్తుందని పేర్కొంటున్నారు. అలాగే రాత్రి భోజనానికి అరగంట ముందు గోరు వెచ్చని నీరు తాగితే ఆహారం సులభంగా అరుగుతుందని చెబుతున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ టీ, కాఫీ లాంటివి తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు.
News February 3, 2026
జల్జీవన్ మిషన్ నిధులు నిలిపివేత

జల్జీవన్ మిషన్లో మిగిలిన పనులకు నిధులు నిలిపివేస్తున్నట్లు కేంద్రం రాజ్యసభలో ప్రకటించింది. 2019లో చేపట్టిన ఈ స్కీమ్లో ₹2.08 లక్షల CR 2024-25కే ఖర్చయి 81.5% పనులే పూర్తయ్యాయి. పలు రాష్ట్రాల్లో అక్రమాలు గుర్తించిన కేంద్రం మిగతా పనులకు నిధులు రాష్ట్రాలే భరించాలని స్పష్టం చేసింది. FY26-27కు కేటాయించిన ₹67,670 CR నిర్వహణకు ఇవ్వనుంది. కాగా APలో రూ.23వేల కోట్ల పనులకు ఇటీవలే కేంద్రం ఆమోదం తెలిపింది.


