News February 19, 2025
సిద్దిపేటలో ప్రియుడితో కలిసి భర్త హత్యకు యత్నం

ప్రియుడితో కలిసి భర్త హత్యకు భార్య యత్నించింది. పోలీసుల వివరాలిలా.. సిద్దిపేటలోని గుండ్లచెరువు కాలనీ వాసికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతడి భార్యకు అదే కాలనీకి చెందిన శ్రవణ్తో వివాహేతర సంబంధం ఉంది. తమకు అడ్డుగా ఉన్న భర్త హత్యకు ప్రియుడితో కలిసి భార్య ప్లాన్ చేసింది. శ్రవణ్ తన స్నేహితులతో కలిసి 2సార్లు దాడి చేయగా భర్త ఇచ్చిన ఫిర్యాదుతో విచారించిన పోలీసులు శ్రవణ్ను రిమాండ్కు తరలించారు.
Similar News
News September 14, 2025
పెదాలు అందంగా ఉండాలంటే

పెదాలు అందంగా, తాజాగా ఉండాలంటే మీ స్కిన్కేర్లో లిప్ఆయిల్ యాడ్ చేసుకోవాల్సిందే. ఇది చూడటానికి లిప్గ్లాస్లా ఉంటుంది. దీనిలోని మాయిశ్చరైజింగ్ గుణాలు పెదాలు పగలకుండా చూస్తాయి. వీటిని లిప్స్టిక్కి జత చేస్తే పెదాలు ఎక్స్ట్రా షైనీగా ఉంటాయి. లిప్ఆయిల్స్లో ఉండే విటమిన్స్, ఫ్యాటీయాసిడ్స్ లిప్బామ్ కంటే ఎక్కువ హైడ్రేషన్ ఇస్తాయి. వీటిలో కూడా SPF ఉండేవి వాడితే యూవీ కిరణాల నుంచి పెదాలని రక్షిస్తాయి.
News September 14, 2025
జానంపేటలో అత్యధిక వర్షపాతం నమోదు

మహబూబ్ నగర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా మూసాపేట మండలంలోని జానంపేటలో 51.5 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయింది. బాలానగర్ 50.5, భూత్పూర్ 12.8, మహబూబ్ నగర్ గ్రామీణం 12.3, దేవరకద్ర 11.8, రాజాపూర్ 7.8, నవాబుపేట 6.8, హన్వాడ 6.3, జడ్చర్ల 5.0 మిల్లీ మీటర్లు వర్షం పడింది.
News September 14, 2025
MBNR: జాతీయ లోక్ అదాలత్..2,597 కేసులు పరిష్కారం

జాతీయ మెగా లోక్ అదాలత్లో మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో 2,597 కేసులు పరిష్కారమయ్యాయని జిల్లా ఎస్పీ డి.జానకి అన్నారు. ఆమె మాట్లాడుతూ.. 15 రోజులుగా పోలీస్ అధికారులు, కోర్టు సిబ్బంది కేసుల్లో ఉన్న కక్షిదారులను స్వయంగా కలిసినందువల్ల రాజీ మార్గం అవగాహన కలిగించి, లోక్ అదాలత్ ద్వారా ఇరు వర్గాలకూ ‘మీ ఇంటికే సత్వర న్యాయం’ జరిగిందని, మానిటరింగ్ చేసిన చేసినవారికి త్వరలో రివార్డు అందజేస్తామన్నారు.