News April 12, 2024

సిద్దిపేటలో రూ.5,70,640 నగదు సీజ్

image

సిద్దిపేట జిల్లాలో పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు చేస్తున్నారు. ఆధారాలు లేకుండా తీసుకెళ్తున్న రూ.5,79,640 సీజ్ చేసినట్లు సిద్దిపేట సీపీ డాక్టర్ బి. అనురాధ తెలిపారు. వంటిమామిడి చెక్ పోస్టు వద్ద రూ.1,50,000, గౌరారం పోలీస్ స్టేషన్ ఎదురుగా రూ.76,640, ముస్త్యాల చెక్ పోస్టు వద్ద రూ.1,60,000, రాజగోపాలపేట పోలీస్ స్టేషన్ వద్ద రూ.1,10,000, హబ్సిపూర్ X రోడ్ వద్ద రూ. 83,000 సీజ్ చేసినట్లు చెప్పారు.

Similar News

News September 10, 2025

మెదక్: క్రికెట్ మైదానం ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన ఎస్పీ

image

మెదక్ పట్టణంలోని జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో క్రికెట్ మైదానం ఏర్పాటు పనులకు బుధవారం ఎస్పీ డీవీ శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. పోలీసు సిబ్బంది శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం కోసం క్రీడలు ఎంతో కీలకమన్నారు. పోలీసు శాఖలోని యువ సిబ్బంది ప్రతిభను వెలికితీయడానికి, క్రీడా పోటీలను నిర్వహించేందుకు క్రికెట్ మైదానం ఉపయోగపడుతుందన్నారు. సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

News September 10, 2025

మెదక్: చాకలి ఐలమ్మకు నివాళులర్పించిన కలెక్టర్

image

మెదక్ కలెక్టరేట్‌లో చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి జరిపారు. కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ రాజ్ ముఖ్య అతిథిగా హాజరై చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

News September 10, 2025

మెదక్: విద్యుదాఘాతంతో యువ రైతు మృతి

image

చేగుంట మండలం చిటోజిపల్లికి చెందిన తలారి గోవర్ధన్(32) అనే యువ రైతు పొలంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. మంగళవారం ఉదయం తన వ్యవసాయ పొలంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో దాన్ని సరిచేయడానికి ప్రయత్నిస్తుండగా, ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ తగిలి అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడి భార్య తలారి స్వప్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.