News March 31, 2025
సిద్దిపేట్: స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టాలి: కిషన్ రెడ్డి

త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టిపెట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర పదాధికారులు జిల్లా అధ్యక్షుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్సీలుగా గెలిచిన మల్క కొమురయ్య, అంజిరెడ్డిలను అభినందించారు.
Similar News
News April 2, 2025
సత్యవేడు: పింఛన్ డబ్బుతో పరార్.. అధికారి సస్పెండ్

సత్యవేడు మండలంలోని కాలమనాయుడుపేట రైతు సేవా కేంద్రంలో పనిచేస్తున్న పశుసంవర్ధక శాఖ సహాయకుడు షేక్ సహిదుల్లాను సస్పెండ్ చేస్తూ తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ ఉత్తర్వులు జారీ చేశారు. విధులు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం, రైతుల నుంచి అక్రమంగా నగదు వసూలు చేయడం, సామాజిక పింఛన్ల సొమ్ముతో పారిపోవడం తదితర కారణాలతో ఆయనపై చర్యలు తీసుకున్నారు. నగదు స్వాహపై పోలీసులకు అధికారులు ఫిర్యాదు చేశారు.
News April 2, 2025
నెల్లూరు: గురుకులాల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

నెల్లూరు జిల్లాలోని నెల్లూరు అక్కచెరువు పాడు, గండిపాళెం, తుమ్మల పెంట, ఆత్మకూరు గురుకుల పాఠశాలలో 2025 -26 సంవత్సరానికి గాను 5, 6, 7 ,8వ తరగతులలో ప్రవేశం పొందేందుకు అర్హులు ఆన్లైన్లో https://aprs.apcfss.in దరఖాస్తు చేసుకోవాలని గురుకులాల జిల్లా కన్వీనర్ జీ. మురళీకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల ఆరో తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని, 25న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. సద్వినియోగం చేసుకొవాలన్నారు.
News April 2, 2025
పర్చూరులో విషాదం.. యువకుడు మృతి

ఉమ్మడి ప్రకాశం జిల్లా పర్చూరు నెహ్రూనగర్ లో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. చుక్కా వంశీ అనే యువకుడు ఆరు మంది స్నేహితులతో కలిసి సముద్ర స్నానానికి వాడరేవు వెళ్లాడు. వంశీ స్నానం చేస్తుండగా సముద్రంలో మునిగి చనిపోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వంశీ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.