News February 1, 2025
సిద్దిపేట: అయ్యో పాపం.. కాలు తీసేశారు..!

సిద్దిపేట జిల్లా గోవర్ధనగిరిలో రెండురోజుల క్రితం <<15308889>>ఉపాధి హామీ<<>> కూలీలపై మట్టి పెళ్లలు పడిన ఘటనలో తీవ్ర గాయాల పాలయిన ఇంద్రాల స్వరూప కాలు నుజ్జు నుజ్జు కావడంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి డాక్టర్లు ఆమె కాలును తొలగించారు. ఈ సంఘటనలో తల్లి కూతుర్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. చికిత్స తీసుకొని ఇంటికి వస్తుందని అనుకున్న స్వరూప కాలు తీసేయడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
Similar News
News December 20, 2025
‘రాజాసాబ్’ నుంచి త్వరలో మరో ట్రైలర్?

ప్రభాస్ హీరోగా నటించిన ‘రాజాసాబ్’ సినిమా నుంచి మరో ట్రైలర్ విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెల 27న హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందని, అదే ఈవెంట్లో రిలీజ్ ట్రైలర్ను విడుదల చేస్తారని సమాచారం. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. మారుతి డైరెక్ట్ చేసిన ఈ రొమాంటిక్ హారర్ కామెడీ ఫిల్మ్ జనవరి 9న థియేటర్లలోకి రానుంది.
News December 20, 2025
జగిత్యాల జిల్లాలో కాస్త తగ్గిన చలి తీవ్రత

జగిత్యాల జిల్లాలో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. గుల్లకోటలో 15.4℃లు నమోదుకాగా సారంగాపూర్, గోవిందారం 15.7, పూడూర్ 15.8, ఎండపల్లిలో 16.0గా నమోదైంది. కథలాపూర్, మల్యాల, సిరికొండ, మల్లాపూర్, మేడిపల్లి, జగిత్యాల, గొల్లపల్లి, మారేడుపల్లి, నేరెళ్ల, మెట్పల్లి, గోదూరు, వెల్గటూర్, బుద్ధేశ్పల్లి, కొల్వాయి, పొలాస, రాయికల్, అల్లీపూర్ ప్రాంతాల్లో 16.1℃గా నమోదైంది. నిన్నటితో పోలిస్తే చలి కాస్త తగ్గింది.
News December 20, 2025
ఉమ్మడి కరీంనగర్ మహిళలకు GOOD NEWS..!

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లోని SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థలో మహిళలకు బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్పై ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ డీ.సంపత్ తెలిపారు. DEC 29 నుంచి శిక్షణ ప్రారంభం అవుతుందని, ఈనెల 27 వరకు ఆసక్తిగలవారు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన 19 నుంచి 45 ఏళ్ల మహిళలు అర్హులని పేర్కొన్నారు. SHARE IT.


