News February 1, 2025
సిద్దిపేట: అయ్యో పాపం.. కాలు తీసేశారు..!

సిద్దిపేట జిల్లా గోవర్ధనగిరిలో రెండురోజుల క్రితం <<15308889>>ఉపాధి హామీ<<>> కూలీలపై మట్టి పెళ్లలు పడిన ఘటనలో తీవ్ర గాయాల పాలయిన ఇంద్రాల స్వరూప కాలు నుజ్జు నుజ్జు కావడంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి డాక్టర్లు ఆమె కాలును తొలగించారు. ఈ సంఘటనలో తల్లి కూతుర్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. చికిత్స తీసుకొని ఇంటికి వస్తుందని అనుకున్న స్వరూప కాలు తీసేయడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
Similar News
News December 17, 2025
ఉగాది నాటికి మరో 5 లక్షల గృహప్రవేశాలు: CM

AP: గడువులోగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని CM CBN కలెక్టర్లను ఆదేశించారు. ‘ఇటీవల 3 లక్షల ఇళ్లకు సామూహిక గృహప్రవేశాలు నిర్వహించాం. ఉగాది నాటికి మరో 5 లక్షల గృహప్రవేశాలు నిర్వహించబోతున్నాం. ప్రతి 3 నెలలకు టార్గెట్ పెట్టుకుని నిర్మాణం పూర్తి చేయాలి. గతంలో ఊళ్లకు దూరంగా ఇళ్ల స్థలాలు కేటాయించడంతో కొందరు వెళ్లడం లేదు. వారికి ఇతర ప్రాంతాల్లో స్థలాలు కేటాయించాలి’ అని సూచించారు.
News December 17, 2025
విధులపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు: జేసీ

ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో అలసత్వం ప్రదర్శించే పంచాయతీ కార్యదర్శులపై కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ నిశాంతి హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాలని, నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
News December 17, 2025
నర్సింహునిపేట సర్పంచ్గా రాజమణి గెలుపు

జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నరసింహునిపేట గ్రామ సర్పంచ్గా సంది రాజమణి విజయం సాధించారు. తన సమీప అభ్యర్థి వడియాల అరుణపై 78 ఓట్ల ఆదిక్యంతో రాజమణి గెలిచారు. ఇక్కడ వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవం కాగా, సర్పంచ్గా ఇద్దరు బరిలో ఉన్నారు. కాగా, రాజమణి కాంగ్రెస్ పార్టీ మద్దతుతో విజయం సాధించినట్లు పార్టీ నాయకుల పేర్కొన్నారు.


