News January 31, 2025

సిద్దిపేట: అవార్డులు అందజేసిన సీపీ

image

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్కృష్ట, అతిఉత్కృష్ట సేవా పతకాలు పొందిన అధికారులను సిబ్బందిని పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ అభినందించి, సేవా పథకాలు అందజేశారు. ఉత్కృష్ట సేవా పథక్ పొందిన వారిలో ఏఆర్ కానిస్టేబుళ్లు కే. శ్రీరామ్, కే.మల్లికార్జున్, మహిళా హోంగార్డు మమ్మద్ నసీమా, అతి ఉత్కృష్ట సేవా పథక్‌ను వెంకటరమణారెడ్డి, గోపాల్ రెడ్డి, ప్రభాకర్, నారాయణ, యాదయ్య, ప్రభు, జీవన్, అలెగ్జాండర్ పొందారు.

Similar News

News November 12, 2025

కల్తీ నెయ్యి కేసు.. ధర్మారెడ్డి చెప్పింది ఇదేనా.?

image

తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసులో TTD మాజీ ఈవో ధర్మారెడ్డిని మంగళవారం సిట్ ప్రశ్నించింది. ఇందులో భాగంగా కల్తీ నెయ్యి వ్యవహారంలో తన ప్రమేయం లేదని ధర్మారెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. <<18262552>>హైకమాండ్<<>>(బోర్డ్/ పొలిటికల్) నిర్ణయాల మేరకే టెండర్లకు ఆమోదం తెలిపామని, రూల్స్‌కు అనుగుణంగా బోర్డులో నిర్ణయాలు తీసుకున్నామని ఆయన చెప్పినట్లు సమాచారం.

News November 12, 2025

NZB: డిగ్రీ విద్యార్థులకు మరో అవకాశం

image

తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పరీక్షల ఫీజులు చెల్లించని డిగ్రీ విద్యార్థులకు మరో అవకాశం కల్పించినట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. ఈ నెల 13 వరకు రూ.100 అపరాధ రుసుముతో విద్యార్థులు పరీక్ష ఫీజులు చెల్లించవచ్చని తెలిపారు. సంబంధిత కళాశాలల యాజమాన్యాలు ఫీజు చెల్లింపుల పత్రాలను ఈ నెల 15 లోపు యూనివర్సిటీలో అందజేయాలని ఆయన సూచించారు.

News November 12, 2025

తాడేపల్లిగూడెం: గడ్డి మందు తాగి..చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

image

తాడేపల్లిగూడెం (M) ఎల్. అగ్రహారంలో నివసిస్తున్న ముప్పడి కార్తీక్ (37) గడ్డి మందు తాగి విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు రూరల్ పోలీసులు మంగళవారం తెలిపారు. ఉద్యోగం లేకపోవడంతో మద్యానికి బానిసై ఈ నెల 6వ తేదీ అర్ధరాత్రి ఇంటి ముందు దొరికిన గడ్డి మందు తాగినట్లు అతని భార్య సునీత రూరల్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.